Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెను వేధిస్తున్నాడని వార్నింగ్ ఇచ్చింది.. అంతే కాల్చేశాడు..

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (16:30 IST)
మహిళలపై వేధింపులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. మహిళలపై దాడికి పాల్పడే వారిపై కఠినమైన శిక్ష విధించేందుకు నిర్భయ, దిశలాంటి చట్టాలొచ్చినా ప్రయోజనం లేదనే చెప్పాలి. తాజాగా తన కుమార్తె (15)ను వేధిస్తున్న యువకుడిని మందలించినందుకు మహిళ(40)ను యువకుడు కాల్చిచంపిన ఘటన బీహార్‌ రాజధాని పట్నాకు సమీపంలోని జగ్గుబిఘ గ్రామంలో వెలుగుచూసింది. 
 
బాధితురాలిని నీలం దేవిగా గుర్తించారు పోలీసులు. పదిరోజుల కిందట తన కుమార్తెను చందన్‌ యాదవ్‌ (25) అనే యువకుడు వేధించడంతో అతడిని నీలం వారించింది. యాదవ్‌ సహా అతని కుటుంబ సభ్యులతోనూ నీలం వాగ్వాదానికి దిగింది.
 
కుమార్తెను వేధిస్తుండటంపై నీలం భర్త లల్లాన్‌ యాదవ్‌, చందన్‌ యాదవ్‌ల మధ్య మరోసారి ఘర్షణ చెలరేగింది. బుధవారం ఉదయం సైతం ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో చందన్‌, అతడి స్నేహితులు నీలం కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. 
 
చందన్‌ కాల్పుల్లో నీలం ప్రాణాలు కోల్పోయింది. బాధితురాలి భర్త ఫిర్యాదుపై చందన్‌, కుందన్‌ సహా 16 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకూ ఒకరిని అరెస్ట్‌ చేశారు. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేపటట్టామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments