కుమార్తెను వేధిస్తున్నాడని వార్నింగ్ ఇచ్చింది.. అంతే కాల్చేశాడు..

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (16:30 IST)
మహిళలపై వేధింపులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. మహిళలపై దాడికి పాల్పడే వారిపై కఠినమైన శిక్ష విధించేందుకు నిర్భయ, దిశలాంటి చట్టాలొచ్చినా ప్రయోజనం లేదనే చెప్పాలి. తాజాగా తన కుమార్తె (15)ను వేధిస్తున్న యువకుడిని మందలించినందుకు మహిళ(40)ను యువకుడు కాల్చిచంపిన ఘటన బీహార్‌ రాజధాని పట్నాకు సమీపంలోని జగ్గుబిఘ గ్రామంలో వెలుగుచూసింది. 
 
బాధితురాలిని నీలం దేవిగా గుర్తించారు పోలీసులు. పదిరోజుల కిందట తన కుమార్తెను చందన్‌ యాదవ్‌ (25) అనే యువకుడు వేధించడంతో అతడిని నీలం వారించింది. యాదవ్‌ సహా అతని కుటుంబ సభ్యులతోనూ నీలం వాగ్వాదానికి దిగింది.
 
కుమార్తెను వేధిస్తుండటంపై నీలం భర్త లల్లాన్‌ యాదవ్‌, చందన్‌ యాదవ్‌ల మధ్య మరోసారి ఘర్షణ చెలరేగింది. బుధవారం ఉదయం సైతం ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో చందన్‌, అతడి స్నేహితులు నీలం కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. 
 
చందన్‌ కాల్పుల్లో నీలం ప్రాణాలు కోల్పోయింది. బాధితురాలి భర్త ఫిర్యాదుపై చందన్‌, కుందన్‌ సహా 16 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకూ ఒకరిని అరెస్ట్‌ చేశారు. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేపటట్టామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mohan Babu: డా. ఎం. మోహన్ బాబు కి MB50 - ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్ గ్రాండ్ ఈవెంట్

Sudheer Babu:.నటుడిగా నేను విజయం సాధిస్తానా? ప్రేక్షకులు నన్ను అంగీకరిస్తారా? నాకు భయంగా ఉంది: సుధీర్ బాబు

Dr. Rajasekhar: మంచి సబ్జెక్ట్ రాలేదనే నిరాశ ఉండేది : డాక్టర్ రాజశేఖర్

Dixit Shetty: ప్రేమ కథని మరో కోణంలో చూపించే ది గర్ల్ ఫ్రెండ్ - దీక్షిత్ శెట్టి

Chinmayi Vs Jani Master: జానీ మాస్టర్, ప్లేబ్యాక్ సింగర్ కార్తీక్‌‌లపై విమర్శలు.. కర్మ వదిలిపెట్టదు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments