Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

సెల్వి
బుధవారం, 23 ఏప్రియల్ 2025 (22:11 IST)
India
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్థాన్ పౌరులు వెంటనే భారతదేశాన్ని విడిచిపోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరించింది. పర్యాటకులైనా, ఇతర కారణాలతో భారత్‌లో ఉన్న పాక్ పౌరులైనా ఇప్పుడే వెళ్లిపోవాల్సిందే అని ప్రకటించింది. 
 
ఇకపై పాకిస్థాన్‌ పౌరులకు వీసాలు మంజూరు చేయబోవడం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇప్పటికే వీసాలు పొందినవారు కూడా ఇండియాలో ఉండడానికి వీలులేదని ఆదేశించింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అత్యవసరంగా నిర్వహించిన భద్రతాపై కేబినెట్ కమిటీ సమావేశంలో పలు కీలక, సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 
 
ఇంకా న్యూఢిల్లీలో ఉన్న పాకిస్థాన్ హైకమిషనర్‌కు కూడా తక్షణమే దేశం విడిచి వెళ్లాలని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అన్ని నిర్ణయాలపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడారు. పహల్గాం ఘటన పట్ల కేంద్రం తీవ్రంగా స్పందించిందని, దేశ భద్రత విషయంలో ఎలాంటి సడలింపు ఉండదని తేల్చేశారు. 
PM MOdi
 
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌పై భారత్ తీసుకున్న 5 చర్యలు
సింధు జల ఒప్పందాన్ని నిలుపుదల చేశారు
పాకిస్తానీ జాతీయులకు సార్క్ వీసాలు లేవు
పాకిస్తానీతో ఉన్న అటారీ సరిహద్దు మూసివేయబడుతుంది
పాకిస్తానీలోని తన హైకమిషన్ నుండి సిబ్బందిని ఉపసంహరించుకునే భారతదేశం 
పాకిస్తాన్ జాతీయుల ప్రస్తుత వీసాలను రద్దు చేయడం, 
వారు 48 గంటల్లోపు భారత్ నుండి వెళ్లిపోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments