Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

Advertiesment
Modi

ఐవీఆర్

, బుధవారం, 23 ఏప్రియల్ 2025 (18:09 IST)
పహల్గామ్ ఉగ్రవాద దాడిని ప్రపంచ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రధానమంత్రి మోడికి సందేశాలు పంపిస్తున్నాయి. "కాశ్మీర్ నుండి వస్తున్న వార్తలు తీవ్రంగా కలతపెట్టేవిగా వున్నాయి" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. "ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశంతో అమెరికా బలంగా నిలుస్తుంది".
 
'అనాగరిక' ఉగ్రవాద దాడిని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. ఆయన మాట్లాడుతూ, "నా ప్రియమైన మిత్రుడు నరేంద్ర మోడీ. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో డజన్ల కొద్దీ అమాయకులను బలిగొన్న, గాయపరిచిన అనాగరిక ఉగ్రవాద దాడి నన్ను తీవ్రంగా బాధించింది. బాధితులు, వారి కుటుంబాలతో మా ప్రార్థనలు ఉన్నాయి. ఉగ్రవాదంపై పోరాటంలో ఇజ్రాయెల్ భారతదేశంతో నిలుస్తుంది" అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి అన్నారు.
 
ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోని, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, యుకె ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, భారతదేశంలో ఫ్రెంచ్ రాయబారి థియరీ మాథౌ, యుఎస్ ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఈ క్రూరమైన దాడి తర్వాత భారతదేశానికి సంఘీభావం తెలిపిన అగ్ర ప్రపంచ నాయకులలో ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?