Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక రోజున బీజేపీకి అదేగతి పడుతుంది : ప్రియాంకా జోస్యం

Webdunia
బుధవారం, 24 జులై 2019 (14:45 IST)
కర్నాటక రాష్ట్రంలో సాఫీగా సాగిపోతున్న కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ అధికారంలోకి రానుంది. దీనిపై కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంకా గాంధీ స్పందించారు. ఒక రోజున బీజేపీ సర్కారు కూడా కుప్పకూలిపోతుందని జోస్యం చెప్పారు. 
 
కర్నాటక ముఖ్యమంత్రిగా ఉన్న హెచ్.డి. కుమార స్వామికి వ్యతిరేకంగా ఓ స్వతంత్ర ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్‌కు చెందిన 18 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేసిన విషయం తెల్సిందే. దీంతో మంగళవారం రాత్రి జరిగిన విశ్వాస పరీక్షలో కుమార్ స్వామి ప్రభుత్వం కూలిపోయింది. 
 
ఫలితంగా కుమార స్వామి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అదేసమయంలో ఈ నెల 25వ తేదీన కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీఎస్. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 
 
దీనిపై ప్రియాంకా గాంధీ స్పందిస్తూ, అన్నింటినీ డబ్బులకు కొనుగోలు చేయలేమనే నిజాన్ని బీజేపీ ఓ రోజున గ్రహిస్తుందన్నారు. బీజేపీ నేతలు చెప్పే అబద్ధాలన్నీ ఒక రోజున బహిర్గతమవుతుయని చెప్పారు. అప్పటికు వరకు ఈ దేశ ప్రజలు తమను తాము కాపాడుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు. 
 
కాగా, 225 సభ్యులు కలిగిన కర్నాటక అసెంబ్లీలో మంగళవారం రాత్రి జరిగిన విశ్వాస పరీక్షలో అధికార కాంగ్రెస్ - జేడీఎస్ సర్కారుకు అనుకూలంగా 99 ఓట్లు రాగా, విపక్ష బీజేపీకి 105 సీట్లు వచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments