Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరణశయ్యపై అమర్ సింగ్.. అమితాబ్‌ ఫ్యామిలీకి క్షమాపణలు

Webdunia
బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (12:04 IST)
సమాజ్‌వాదీ పార్టీ మాజీ అధినేత ములాయం సింగ్‌కు నమ్మనబంటుగా ఉండి, ఒకపుడు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమర్ సింగ్ ఇపుడు మరణశయ్యపై ఉన్నారు. ఈయన ఇపుడు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు క్షమాపణలు చెప్పారు. గతంలో అమితాబ్ కుటుంబం పట్ల అనుచితంగా ప్రవర్తించానని, దానికి ఇపుడు చింతిస్తున్నట్టు పేర్కొన్నాడు. పైగా, అమితాబ్ ఫ్యామిలీ తనను క్షమించాలని పేర్కొంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. 
 
రాజ్యసభ మాజీ సభ్యుడైన అమర్ సింగ్.. తన హవా కొనసాగుతున్న సమయంలో అమితాబ్ ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బచ్చన్‌ది సిగ్గులేని కుటుంబంగా, వేషాలు వేసుకునే కుటుంబంగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై ఇపుడు చింతిస్తున్నారు. ప్రస్తుతం మరణశయ్యపై ఉన్న అమర్‌సింగ్.. అమితాబ్ కుటుంబానికి ఓ వీడియో సందేశం పంపారు. 
 
గతంలో అమితాబ్, ఆయన కుటుంబం పట్ల తాను చేసిన అతి ప్రవర్తనకు చింతిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం జీవన్మరణ సమస్యతో పోరాడుతున్న తాను అమితాబ్, ఆయన కుటుంబాన్ని క్షమాపణలు వేడుకుంటున్నట్టు తెలిపారు. అమితాబ్ కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నట్టు అమర్‌సింగ్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments