Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ ఫోన్ ఛార్జీలు పెంచేయనున్న టెలికాం సంస్థలు.. కారణం అదే?

Webdunia
బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (11:57 IST)
టెలికాం కంపెనీలు ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. సెల్‌ఫోన్ బిల్లులు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర ఖజానాకు భారీగా బకాయిలు చెల్లించాల్సి వున్న టెలికాం సంస్థలు ఛార్జీలు పెంచనిదే మరోదారి లేదనే నిర్ణయానికి వచ్చాయి. ఇప్పటికే గత డిసెంబరులో 42 శాతం వరకు డేటా ఛార్జీలు పెంచిన కంపెనీలు, మరింత పెంపునకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ దఫా ఛార్జీల వడ్డ మరింత పెరిగే అవకాశం వున్నట్లు టెలికాం రంగ నిపుణులు చెప్తున్నారు.  
 
గడిచిన 20 ఏళ్ల కాలానికి టెలికాం సంస్థలు రూ.47 లక్షల కోట్లను కేంద్రానికి బకాయిలుగా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎయిర్‌ టెల్‌ రూ. 35 వేల కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ. 53 వేల కోట్లు కట్టాలి. ఈ భారాన్ని తట్టుకోవాలంటే ప్రస్తుతం సెల్ ఫోన్ ఛార్జీలను పెంచాల్సివుంది. 
 
అదే జరిగితే డేటాను పొదుపుగా వాడుకోవాల్సిన రోజులు మళ్లీ వస్తాయి. వచ్చే ఏడాది వ్యవధిలో వినియోగదారుడి నుంచి వచ్చే నెలసరి సగటును రెట్టింపు చేసుకోవాలన్న టార్గెట్‌తో టెల్కోలు ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి జియో రంగ ప్రవేశానికి ముందు ఒక జీబీ డేటాకు రూ. 200కు పైగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. 2016లో జియో వచ్చిన తరువాత, డేటా ఖర్చు గణనీయంగా పడిపోయిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments