Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ ఫోన్ ఛార్జీలు పెంచేయనున్న టెలికాం సంస్థలు.. కారణం అదే?

Webdunia
బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (11:57 IST)
టెలికాం కంపెనీలు ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. సెల్‌ఫోన్ బిల్లులు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర ఖజానాకు భారీగా బకాయిలు చెల్లించాల్సి వున్న టెలికాం సంస్థలు ఛార్జీలు పెంచనిదే మరోదారి లేదనే నిర్ణయానికి వచ్చాయి. ఇప్పటికే గత డిసెంబరులో 42 శాతం వరకు డేటా ఛార్జీలు పెంచిన కంపెనీలు, మరింత పెంపునకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ దఫా ఛార్జీల వడ్డ మరింత పెరిగే అవకాశం వున్నట్లు టెలికాం రంగ నిపుణులు చెప్తున్నారు.  
 
గడిచిన 20 ఏళ్ల కాలానికి టెలికాం సంస్థలు రూ.47 లక్షల కోట్లను కేంద్రానికి బకాయిలుగా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎయిర్‌ టెల్‌ రూ. 35 వేల కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ. 53 వేల కోట్లు కట్టాలి. ఈ భారాన్ని తట్టుకోవాలంటే ప్రస్తుతం సెల్ ఫోన్ ఛార్జీలను పెంచాల్సివుంది. 
 
అదే జరిగితే డేటాను పొదుపుగా వాడుకోవాల్సిన రోజులు మళ్లీ వస్తాయి. వచ్చే ఏడాది వ్యవధిలో వినియోగదారుడి నుంచి వచ్చే నెలసరి సగటును రెట్టింపు చేసుకోవాలన్న టార్గెట్‌తో టెల్కోలు ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి జియో రంగ ప్రవేశానికి ముందు ఒక జీబీ డేటాకు రూ. 200కు పైగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. 2016లో జియో వచ్చిన తరువాత, డేటా ఖర్చు గణనీయంగా పడిపోయిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments