Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరణశయ్యపై అమర్ సింగ్.. అమితాబ్‌ ఫ్యామిలీకి క్షమాపణలు

Webdunia
బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (12:04 IST)
సమాజ్‌వాదీ పార్టీ మాజీ అధినేత ములాయం సింగ్‌కు నమ్మనబంటుగా ఉండి, ఒకపుడు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమర్ సింగ్ ఇపుడు మరణశయ్యపై ఉన్నారు. ఈయన ఇపుడు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు క్షమాపణలు చెప్పారు. గతంలో అమితాబ్ కుటుంబం పట్ల అనుచితంగా ప్రవర్తించానని, దానికి ఇపుడు చింతిస్తున్నట్టు పేర్కొన్నాడు. పైగా, అమితాబ్ ఫ్యామిలీ తనను క్షమించాలని పేర్కొంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. 
 
రాజ్యసభ మాజీ సభ్యుడైన అమర్ సింగ్.. తన హవా కొనసాగుతున్న సమయంలో అమితాబ్ ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బచ్చన్‌ది సిగ్గులేని కుటుంబంగా, వేషాలు వేసుకునే కుటుంబంగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై ఇపుడు చింతిస్తున్నారు. ప్రస్తుతం మరణశయ్యపై ఉన్న అమర్‌సింగ్.. అమితాబ్ కుటుంబానికి ఓ వీడియో సందేశం పంపారు. 
 
గతంలో అమితాబ్, ఆయన కుటుంబం పట్ల తాను చేసిన అతి ప్రవర్తనకు చింతిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం జీవన్మరణ సమస్యతో పోరాడుతున్న తాను అమితాబ్, ఆయన కుటుంబాన్ని క్షమాపణలు వేడుకుంటున్నట్టు తెలిపారు. అమితాబ్ కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నట్టు అమర్‌సింగ్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments