Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌతమ బుద్ధుడి జన్మస్థలం వివాదం.. భారత్-నేపాల్‌ల మధ్య రచ్చ.. నో డౌట్?

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (19:22 IST)
గౌతమ బుద్ధుడి జన్మస్థలం వివాదం ప్రస్తుతం తెరమీదకు వచ్చింది. రామ జన్మభూమి వివాదం సద్దుమణిగిందని అనుకునే లోపే గౌతమ బుద్ధుడి జన్మస్థలం వివాదం మొదలైంది. ఈ వివాదం భారత్-నేపాల్ దేశాల మధ్య జరుగుతోంది. 
 
శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ ప్రసంగిస్తూ.. బుద్ధుడూ, మహాత్మా గాంధీలు అనుసరించిన మార్గం, చేసిన బోధనలు అందరికీ ఆచరణీమని అన్నారు. అయితే ఇదే ప్రసంగంలో బుద్ధుడు భారతీయుడని జై శంకర్ అన్నట్టు నేపాల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో నేపాల్ విదేశాంగ శాఖ జై శంకర్ వ్యాఖ్యలను తప్పుబట్టింది.
 
బుద్ధుడు నేపాల్‌లోని లుంబినిలో జన్మించారనడానికి ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయని, వాటిని ఎవరూ కాదనలేరని పేర్కొంది. లుంబినీ ప్రాంతం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గానూ ఇప్పటికే గుర్తింపు పొందిందని గుర్తు చేసింది. 2014లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ లో పర్యటించిప్పుడు పార్లమెంట్‌లో మాట్లాడుతూ, ఇదే విషయాన్ని ప్రస్తావించారని గుర్తు చేసింది. 
 
దీనిపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ స్పందిస్తూ.. ఇరు దేశాల మధ్యా బౌద్ధమత వారసత్వం ఉంది. గౌతమ బుద్ధుడు నేపాల్‌లోనే జన్మించాడని, ఈ విషయంలో తమకు ఎటువంటి సందేహాలు లేవని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments