Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరిహద్దుల్లో చనిపోయిన రైతుల వివరాలు లేవు .. పరిహారం ఇవ్వలేం : కేంద్రం

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (13:55 IST)
మూడు వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేసిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల వివరాలు లేవని, అందువల్ల వారికి పరిహారం ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోభాగంగా, విపక్ష ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమాధనమిచ్చారు. 
 
ప్రభుత్వం వద్ధ వివిధ కారణాలతో చనిపోయిన రైతుల వివరాలు లేవని స్పష్టంచేశారు. అందువల్ల వారికి పరిహారం ఇచ్చే సమస్యే లేదని స్పష్టం చేశారు. అదేసమయంలో నిరసనలను ఆపాలని రైతులను ఎప్పటి నుంచో కోరుతున్నామన్నారు. కానీ, వారు వినిపించుకోకుండా సరిహద్దుల్లో ఆందోళన చేస్తూనే ఉన్నారన్నారు. 
 
అలాగే, మరో ఎంపీ పంటలకు కనీస మద్దతు ధర చట్టం అమలు చేస్తారా అని ప్రశ్నించారు. దీనికి మంత్రి తోమర్ సమాధానమిస్తూ, ఇప్పటికే 22 ధరలకు కేంద్రం మద్దతు ధర కల్పించిందని గుర్తుచేశారు. కాగా, సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఆందోళనల్లో దాదాపు 750మంది వరకు చనిపోయినట్టు రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments