Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరిహద్దుల్లో చనిపోయిన రైతుల వివరాలు లేవు .. పరిహారం ఇవ్వలేం : కేంద్రం

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (13:55 IST)
మూడు వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేసిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల వివరాలు లేవని, అందువల్ల వారికి పరిహారం ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోభాగంగా, విపక్ష ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమాధనమిచ్చారు. 
 
ప్రభుత్వం వద్ధ వివిధ కారణాలతో చనిపోయిన రైతుల వివరాలు లేవని స్పష్టంచేశారు. అందువల్ల వారికి పరిహారం ఇచ్చే సమస్యే లేదని స్పష్టం చేశారు. అదేసమయంలో నిరసనలను ఆపాలని రైతులను ఎప్పటి నుంచో కోరుతున్నామన్నారు. కానీ, వారు వినిపించుకోకుండా సరిహద్దుల్లో ఆందోళన చేస్తూనే ఉన్నారన్నారు. 
 
అలాగే, మరో ఎంపీ పంటలకు కనీస మద్దతు ధర చట్టం అమలు చేస్తారా అని ప్రశ్నించారు. దీనికి మంత్రి తోమర్ సమాధానమిస్తూ, ఇప్పటికే 22 ధరలకు కేంద్రం మద్దతు ధర కల్పించిందని గుర్తుచేశారు. కాగా, సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఆందోళనల్లో దాదాపు 750మంది వరకు చనిపోయినట్టు రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభద్రతా భావంలో సల్మాన్ ఖాన్ ... భద్రత రెట్టింపు - బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనం దిగుమతి!!

జానీ మాస్టర్ మంచివారు.. నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి? అని మాస్టర్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments