Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఆర్టీసీ చార్జీల బాదుడు తప్పదంటున్న బాజిరెడ్డి!

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (13:26 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుడు తప్పదని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి అంటున్నారు. పైగా, ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును ప్రజలు కూడా అర్థం చేసుకోని సహకరించాలని కోరుతున్నారు. 
 
బుధవారం ఆర్టీసీ చార్జీల పెంపుపై రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథ్యంలో అధికారులతో ఒక సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డ గోవర్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతపాదన గత నెలలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. 
 
ప్రస్తుతం ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటరుకు రూ.20 పైసలు, ఇతర బస్సుల్లో 30 పైసలు చొప్పున పెంచాలని ప్రతిపాదించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధివిధానాల వల్లే ఆర్టీసీ చార్జీలను పెంచాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ముఖ్యంగా, ఇటీవలి కాలంలో డీజల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని దీనికి కేంద్రమే కారణమన్నారు. తెలంగాణ ఆర్టీసీ రోజుకు 6.8 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుందని తెలిపారు. ఈ ధరలు పెరగడం వల్ల ఇపుడు ప్రయాణికులపై భారం మోపక తప్పడం లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments