Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎయిర్‌టెల్ యూజర్లకు ఉచిత డేటా? ఎలా?

ఎయిర్‌టెల్ యూజర్లకు ఉచిత డేటా? ఎలా?
, ఆదివారం, 28 నవంబరు 2021 (10:04 IST)
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది. ఎంపిక చేసిన టారిఫ్‌లకు ఉచితంగా డేటాను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. 
 
ఇటీవల ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ టారిఫ్‌తో పాటు డేటా ధరల్ని పెంచిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, ప్రీపెయిడ్ ధరల్లో 20 నుంచి 25 శాతం మేరకు పెంచేసింది. అలాగే డేటా టాప్‌అప్ ప్లాన్లపై కూడా 20 నుంచి 21 శాతం మేరకు పెంచేసింది. 
 
ఈ పెరిగిన ధరలు శుక్రవారం అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రీపెయిడ్ సెలెక్టడ్ ప్లాన్స్‌పై ప్రతి రోజూ 500 ఎంబీ వరకు డేటాను ఉచితంగా అందజేయనున్నట్టు ప్రకటించింది. ఇది చాలా మంది యూజర్లకు సౌలభ్యంగా ఉండనుంది. 
 
మరోవైపు, ఎయిర్ టెల్ పెంచిన ధరల మేరకు.. ఇప్పటివరకు రూ.79గా ఉన్న బేసిక్ ప్లాన్ ఇపుడు రూ.99కు చేరింది. దీని కాలపరిమితి 28 రోజులుగా నిర్ణయించింది. 
 
అలాగే, అన్‌లిమిటెండ్ వాయిసా కాల్ ప్లాన్‌ను రూ.149 నుంచి రూ.179కి పెంచేసింది. అలాగే, రూ.2498 ప్లాన్‌ను ఇపుడు ఏకంగా రూ.2999కు చేర్చింది. ఇది వార్షక ప్లాన్. 
 
అదేవిధంగా డేటా ప్లాన్‌లో డేటా టాప్‌అప్‌లో రూ.48 ప్లాన్‌ను ఇకపై రూ.58కి పెంచింది. అలాగే, రూ.98 ప్లాన్‌ను కొత్తగా రూ.118కు చేర్చింది. ఈ ప్లాన్ కింద 12 జీబీ డేటాను ఇవ్వనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు తెరాస పార్లమెంటరీ పార్టీ కీలక భేటీ!