Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మలా సీతారామన్‌ నాకు స్నేహితురాలు : నోబెల్ పురస్కార గ్రహీత

Webdunia
సోమవారం, 21 అక్టోబరు 2019 (16:03 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తనకు స్నేహితురాలని నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ అన్నారు. ఆయన తాజాగా మాట్లాడుతూ, ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో (జేఎన్‌యూ) తాము కలిసి చదువుకున్నామని గుర్తు చేశారు. 
 
1983లో అభిజిత్‌ జేఎన్‌యూలో ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్‌ పూర్తిచేయగా, నిర్మలాసీతారామన్‌ కూడా ఎకనమిక్స్‌లో మాస్టర్స్‌తోపాటు 1984లో ఎంఫిల్‌ పూర్తిచేశారు. దేశం గురించి జేఎన్‌యూలో తాను ఎంతో నేర్చుకున్నానని అభిజిత్‌ తెలిపారు. 
 
నిర్మల తనకు స్నేహితురాలని, ఆమె చాలా తెలివైనవారన్నారు. అప్పట్లో తమ రాజకీయ భావనలు కూడా నాటకీయంగా భిన్నంగా ఉండేవి కాదన్నారు. బీజేపీ ప్రభుత్వం పట్ల తాను విమర్శలు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. 'గతంలో నేను చేసిన వ్యాఖ్యలను వారు పరిశీలించాలి. యూపీఏ పాలనపైనా నేను తీవ్ర విమర్శలు చేశాను' అని గుర్తుచేశారు. 
 
కాగా, పేదరిక నిర్మూలనకు విశిష్ట పరిశోధనలు జరిపిన అభిజిత్‌కు ఈ యేడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం వరించిన విషయం తెలిసిందే. అభిజిత్‌తోపాటు ఆయన భార్య డ్యుఫ్లో, మైఖెల్‌ క్రేమర్‌ కూడా నోబెల్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం వీరంతా అమెరికాలో నివసిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments