Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమృత్ కాలానికి తొలి పద్దు.. సప్తర్షి రీతిలో ఈ బడ్జెట్‌ను రూపొందించాం : విత్తమంత్రి

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (12:56 IST)
2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అమృత్‌ కాలానికి ఇది తొలి పద్దు అని వెల్లడించారు. సప్తర్షి (సప్త రుషుల) రీతిలోనే బడ్జెట్‌లో ఏడు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆమె ఉభయ సభల సభ్యుల సమక్షంలో వెల్లడించారు. 
 
ఈ సప్తర్షిలలో సమ్మిళత వృద్ధి, చిట్టచివరి వ్యక్తికి కూడా లబ్ధి చేకూరాలి, మౌలిక సదుపాయాలు- పెట్టుబడులు, సామర్థ్యాలను వెలికితీయడం, హరిత వృద్ధి, యువత, ఆర్థిక రంగం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు. 
 
అమృత కాలంలో ప్రవేశ పెడుతున్న ఈ తొలిబడ్జెట్‌లో అన్ని వర్గాల సంక్షేమానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. తొమ్మిదేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించామని చెప్పారు.
 
మరోవైపు, నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. స్వాతంత్ర్యం భారతదేశంలో వరుసగా ఐదుసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా ఖ్యాతిగడించారు. ఈ జాబితాలో అరుణ్‌ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్‌ సిన్హా, మన్మోహన్‌ సింగ్‌, మొరార్జీ దేశాయ్‌ ఉన్నారు. 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీతారామన్‌ వరుసగా బడ్జెట్‌ ప్రవేశపెడుతూ వస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments