Webdunia - Bharat's app for daily news and videos

Install App

2022 ఆగస్ట్ 15వ తేదీ నాటికి పార్లమెంటు కొత్త భవనం

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (15:56 IST)
parlement
కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తొన్న పార్లమెంటు కొత్త భవనం వచ్చే ఏడాది 2022 ఆగస్ట్ 15వ తేదీ నాటికి వాడుకునేందుకు అందుబాటులోకి రానుందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. శరవేగంగా సాగుతున్న భవన నిర్మాణం అందుబాటులోకి వచ్చేందుకు ఏడాది పడుతుందని స్పీకర్ వివరించారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనం 1927 లో నిర్మించారని, ఇప్పుడది పాతబడిందని, భద్రతా సమస్యలు, స్థలాభావం, భూకంపాల నుంచి రక్షణలాంటివి లేకుండా పార్లమెంటు నిర్మాణం చెయ్యాలని నిర్ణయించుకుంది.
 
భారతదేశ కొత్త పార్లమెంటు భవనం నిర్మాణానికి 2020 డిసెంబర్ 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు వ్యయం 971 కోట్ల రూపాయలని, నిర్మాణ పనులను టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ భవనం డిజైన్‌ను రూపొందించినట్లు స్పీకర్ చెప్పారు.
 
మొత్తం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే కొత్త పార్లమెంటు భవనం భారతదేశపు భిన్నత్వాన్ని ప్రతిబింబించేలా ఆత్మనిర్భర్ భారత్ దేవాలయంలా ఉంటుందని ఓం బిర్లా అభివర్ణించారు. వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments