Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో 6 వేల మంది ఆర్టీసీ కార్మికుల సస్పెండ్

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (15:41 IST)
మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఒకేసారి ఆరు వేల మంది ఆర్టీసీ కార్మికులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వలు జారీచేసింది. దీంతో మహారాష్ట్ర వ్యాప్తంగా బస్సు రవాణా వ్యవస్థ స్తంభించింది. 
 
రావాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఆ సంస్థకు చెందిన కార్మికులు గత నెల రోజులుగా నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. దీంతో కన్నెర్ర జేసిన ఆర్టీసీ యాజమాన్యం ఆరు వేల మందిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. 
 
గత కొన్ని రోజులుగా ఈ సమ్మెపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూనే వుంది. ఈ క్రమంలో శనివారం 3010 మందిని సస్పెండ్ చేయగా, 270 మందిని కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించింది. ఆదివారం కూడా మరికొంతమందిని తొలగించింది. ఇలా మొత్తం సస్పెండ్ కార్మికుల సంఖ్య ఆరువేలకు చేరింది. 
 
ఇదిలావుంటే, ఆర్టీసీ కార్మిక సంఘాలతో రవాణా మంత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. కార్మికులంతా సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా, 92622 మంది ఉద్యోగుల్లో 18 వేల మంది విధులు నిర్వహిస్తున్నారని, మిగిలిన ఉద్యోగులు కూడా విధుల్లో చేరాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments