Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో 6 వేల మంది ఆర్టీసీ కార్మికుల సస్పెండ్

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (15:41 IST)
మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఒకేసారి ఆరు వేల మంది ఆర్టీసీ కార్మికులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వలు జారీచేసింది. దీంతో మహారాష్ట్ర వ్యాప్తంగా బస్సు రవాణా వ్యవస్థ స్తంభించింది. 
 
రావాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఆ సంస్థకు చెందిన కార్మికులు గత నెల రోజులుగా నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. దీంతో కన్నెర్ర జేసిన ఆర్టీసీ యాజమాన్యం ఆరు వేల మందిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. 
 
గత కొన్ని రోజులుగా ఈ సమ్మెపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూనే వుంది. ఈ క్రమంలో శనివారం 3010 మందిని సస్పెండ్ చేయగా, 270 మందిని కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించింది. ఆదివారం కూడా మరికొంతమందిని తొలగించింది. ఇలా మొత్తం సస్పెండ్ కార్మికుల సంఖ్య ఆరువేలకు చేరింది. 
 
ఇదిలావుంటే, ఆర్టీసీ కార్మిక సంఘాలతో రవాణా మంత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. కార్మికులంతా సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా, 92622 మంది ఉద్యోగుల్లో 18 వేల మంది విధులు నిర్వహిస్తున్నారని, మిగిలిన ఉద్యోగులు కూడా విధుల్లో చేరాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments