Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ విద్యార్థినిని నమ్మించి గర్భవతిని చేసిన పీజీ స్టూడెంట్

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (17:38 IST)
కపట ప్రేమను నటించి ఆడవారిని వలలో వేసుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అత్యాచార ఘటనలు, నమ్మించి మోసం చేయడం వంటి వార్తలు రోజూ వస్తూనే ఉన్నాయి. బాలికను నమ్మించి గర్భం దాల్చేలా చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
 
అరియలూరు జిల్లా కాత్తాన్‌కుడికాడు గ్రామానికి చెందిన పరమశివం అనే వ్యక్తి అరియలూరు పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో పీజీ చదువుతున్నాడు. అదే ప్రాంతంలో ప్లస్ టూ చదువుతున్న విద్యార్థినిపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి ప్రేమలోకి దించాడు. అతడిని నమ్మిన ఆ బాలిక అతడితో శారీరకంగా కలిసింది. గర్భందాల్చింది.
 
శరీరంలో మార్పులు చోటుచేసుకుంటుండటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టింది. తల్లిదండ్రులు ఏమీ చేయలేక అబార్షన్ చేయించేందుకు హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అప్పటికే 5 నెలలు నిండి ఉండటంతో కుదరదని వైద్యులు చెప్పారు. హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా వారు రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టారు. బాధితులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు పరమశివంపై కేసు నమోదు చేసి అరెస్టు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments