Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతిథులతో కలిసి డ్యాన్స్ చేసిందనీ.. భార్యను కడతేర్చిన భర్త

Webdunia
గురువారం, 16 మే 2019 (09:14 IST)
అతిథులతో కలిసి కట్టుకున్న భార్య డ్యాన్స్ చేయడం ఆ భర్తకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో పశువుల పాకలోకి తీసుకెళ్లి ఊపిరాడకుండా చేసి చంపేశాడు కట్టుకున్న భర్త. ఈ దారుణం బీహార్ రాష్ట్రంలోని పాట్నా జిల్లా హసది ముషారి ప్రాంతంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖోరంగ్‌పూర్‌ గ్రామానికి చెందిన రంజిత్‌ మాంఝీ భార్య మునియా దేవి హసదిలోని తన తల్లిదండ్రుల వద్దకు 10 రోజుల క్రితం వచ్చింది. వేసవి సెలవులు కావడంతో తన ఇద్దరు పిల్లలను కూడా తీసుకొచ్చింది. 
 
ఈ క్రమంలో అదే ఊరిలో ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఆమె భర్త రంజిత్ మాంఝీ కూడా అత్తగారింటికి వచ్చాడు. ఆ తర్వాత భార్యాపిల్లలతో కలిసి వివాహ శుభకార్యానికి వెళ్లారు. ఈ శుభకార్యంలో డీజేకు అనుగుణంగా అతిథులతో కలిసి మునియా దేవి నృత్యం చేసింది. 
 
తన ముందే భార్య ఇలా చేయడం రంజిత్ వేయడం భర్త జీర్ణించుకోలేక పోయాడు. అందరి ఎదుటే భార్యను చితకబాదిన మాంఝీ ఆ తర్వాత ఆమెను పశువుల పాకలోకి తీసుకువెళ్లి ఊపిరాడకుండా చేసి ప్రాణం తీశాడు. ఘటనా స్థలంలోనే భార్య మునియా మరణించగా నిందితుడు పరారయ్యాడు. 
 
దీంతో పెళ్లి ఇంట విషాదం నెలకొంది. దీనిపై ఇరుగుపొరుగువారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. రంజిత్‌ను అరెస్టు చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments