Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ ఫోన్‌లో ఆ నెంబర్లెవరివి? వారితో నీకు లింకేంటి? భర్త వేధింపులు, భార్య సుసైడ్

Webdunia
బుధవారం, 15 మే 2019 (21:55 IST)
భర్త, అత్త సూటిపోటి మాటలు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బాచుపల్లి పియస్ పరిధిలోని నిజాంపేట్‌లో జరిగింది. వికారాబాద్ జిల్లా, తాండూర్ ప్రాంతానికి చెందిన రాజశేఖర్, పుష్పలత(24) లకు నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. బ్రతుకుదెరువు కోసం గత మూడు నెలల క్రితం నిజాంపేటకు వలస వచ్చి కుకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ మంజీరా షాపింగ్ మాల్‌లో రాజశేఖర్ సెక్యురిటీగా, అదే మాల్‌లో పుష్పలత హౌస్ కీపింగ్‌లో పని చేస్తున్నారు.
 
భార్యాభర్తలు తరుచూ గొడవ పడేవారు. భర్త ఎప్పుడూ తన భార్య ఫోన్లో ఫోన్ నెంబర్‌లు చెక్ చేస్తూ తరచూ అనుమానంగా సూటిపోటి మాటలతో భార్యను వారితో వీరితో ఎందుకు మాట్లాడావని వేధించేవాడు. భర్త వేదింపులకు తోడు అత్త వేధింపులు కూడా తోడవడంతో భార్య పుష్పలత తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. 
 
భర్త, అత్త కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్టు సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి పైకప్పుకున్న రాడ్‌కి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటి తలుపులు ఎంతకూ తెరవకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా పుష్పలత ఉరి వేసుకున్నట్లు కనపడటంతో బాచుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments