Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తోంది : సంజయ్ రౌత్

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (12:46 IST)
ఎన్సీపీ నేత శరద్ పవార్‌ను భారతీయ జనతా పార్టీ బెదిరిస్తుందని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వ రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయంతెల్సిందే. శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి నెలకొంది. 
 
ఈ పరిణామాలపై సంజయ్ రౌత్ స్పందిస్తూ, మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి ప్రధాన కారణం బీజేపీ అని ఆయన ఆరోపించారు. శివసేన ఎమ్మెల్యేల్లో మెజార్టీ సభ్యుల మద్దతు తమకే ఉందన్నారు. అదేసమయంలో ఎన్సీపీ చీఫ్‌ శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తుందని ఆరోపించారు. 
 
మరోవైపు, రెబల్ ఎమ్మెల్యేల బలం మరింతగా పెరిగింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్‌కు మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన మద్దతు నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటికే 47మంది ఎమ్మెల్యేలు షిండే గూటికి చేరగా, వీరిలో 37 మంది ఎమ్మెల్యేలు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తరపున ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments