మధురైలో మాస్క్ పరోటాలు.. జోరందుకున్న అమ్మకాలు..

Webdunia
బుధవారం, 8 జులై 2020 (21:39 IST)
mask parottas
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో మాస్క్ అనేది జీవితంలో భాగమైపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించడం తప్పనిసరి అంటూ ఓ హోటల్ యజమాని వినూత్న ప్రచారం చేశాడు. 
 
ఇంత జరుగుతున్నా కొందరు మాత్రం మాస్క్ ధరించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారికి మాస్క్ గురించి అవగాహన కల్పించే రీతిలో తమిళనాడు మధురైకు చెందిన హోటల్ నిర్వహకుడు కె.ఎల్ కుమార్ మాస్క్ ఆకారంలో ఉన్న పరోటాను తయారు చేశాడు. 
 
కరోనా కారణంగా మధురై జిల్లా అంతా లాక్‌డౌన్‌లో ఉండటంతో... ప్రజలకు మాస్క్‌లుపై మరింత అవగాహన కల్పించేందుకే ఈ రకరమైన పరోటా మాస్క్ తయారు చేశారని తెలిపాడు. చెన్నై నుంచి అనేకమంది మధురైకి చేరడంతో మధురైలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. 
 
ఇంకా చాలామంది మాస్కులు ధరించకుండా.. రోడ్లపై తిరుగుతున్నారు. ఇలాంటి వారికి అవగాహన కలిగించేలా మాస్క్ ఆకారంలో పరోటా తయారు చేసినట్లు కుమార్ తెలిపాడు. ఈ పరోటాల విక్రయం జోరందుకుంటుందని.. రెండు పరోటాలు 50 రూపాయలకు అమ్ముతున్నట్లు కుమార్ చెప్పుకొచ్చాడు. ఆన్ లైన్ ఫుడ్ యాప్‌లోనూ ఈ పరోటాలను కొనుగోలు చేస్తున్నారని కుమార్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments