Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధురైలో దారుణం.. తలనరికి చర్చి ముందు విసిరేసిన వ్యక్తి

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (17:06 IST)
నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా తమిళనాడులోని మధురైలో దారుణం జరిగింది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ గ్యాంగ్ ఓ వ్యక్తిని కిరాతకంగా హతమార్చింది. అతని తల నరికి సమీపంలోని చర్చి ముందు విసిరేసింది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి తన కెమెరాలో ఈ దృశ్యాలను చిత్రీకరించడంతో... ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పట్టపగలే జరిగిన ఈ హత్యతో మధురై ఉలిక్కిపడింది.
 
వివరాల్లోకి వెళితే.. ఊతంగడికి చెందిన మురుగానందం (22) నవంబర్ 16 తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లాడు. నిత్యం రద్దీగా ఉండే కిజావసల్ ప్రాంతంలోని ఓ వీధి గుండా నడుచుకుంటూ వెళ్తుండగా... కారులో వచ్చిన కొంతమంది వ్యక్తులు అతన్ని అడ్డగించారు. ఈ క్రమంలో మురుగానందం పారిపోయేందుకు యత్నించగా.. ఆ గ్యాంగ్ అతన్ని వెంబడించి మరీ హత్య చేసింది. మురుగానందం తల నరికి సమీపంలోని చర్చి ముందు విసిరేసింది.
 
ఆ గ్యాంగ్ దాడిలో మురుగానందం స్నేహితుడు కూడా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అతని నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఇంకా విచారణ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments