Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధురైలో దారుణం.. తలనరికి చర్చి ముందు విసిరేసిన వ్యక్తి

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (17:06 IST)
నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా తమిళనాడులోని మధురైలో దారుణం జరిగింది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ గ్యాంగ్ ఓ వ్యక్తిని కిరాతకంగా హతమార్చింది. అతని తల నరికి సమీపంలోని చర్చి ముందు విసిరేసింది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి తన కెమెరాలో ఈ దృశ్యాలను చిత్రీకరించడంతో... ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పట్టపగలే జరిగిన ఈ హత్యతో మధురై ఉలిక్కిపడింది.
 
వివరాల్లోకి వెళితే.. ఊతంగడికి చెందిన మురుగానందం (22) నవంబర్ 16 తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లాడు. నిత్యం రద్దీగా ఉండే కిజావసల్ ప్రాంతంలోని ఓ వీధి గుండా నడుచుకుంటూ వెళ్తుండగా... కారులో వచ్చిన కొంతమంది వ్యక్తులు అతన్ని అడ్డగించారు. ఈ క్రమంలో మురుగానందం పారిపోయేందుకు యత్నించగా.. ఆ గ్యాంగ్ అతన్ని వెంబడించి మరీ హత్య చేసింది. మురుగానందం తల నరికి సమీపంలోని చర్చి ముందు విసిరేసింది.
 
ఆ గ్యాంగ్ దాడిలో మురుగానందం స్నేహితుడు కూడా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అతని నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఇంకా విచారణ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments