Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్‌ బాలికపై ఐదుగురు వ్యక్తులు రేప్.. ఇద్దరు పోలీసులు కూడా?

రక్షణ కల్పించాల్సిన పోలీసులే నిందితులుగా మారారు. జార్ఖండ్‌లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. బాధితులకు అండగా ఉండి చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే దారుణానికి పాల్పడ్డారు. మైనర్ బాలికపై ఐదుగురు వ్యక్తులు అత

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (11:27 IST)
రక్షణ కల్పించాల్సిన పోలీసులే నిందితులుగా మారారు. జార్ఖండ్‌లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. బాధితులకు అండగా ఉండి చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే దారుణానికి పాల్పడ్డారు. మైనర్ బాలికపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇందులో ఇద్దరు పోలీసులు కూడా వున్నారని బాధితురాలు ఆ రాష్ట్ర సీఎం రఘుబర్ దాస్‌కు ఫిర్యాదు చేసింది. 
 
ఈ ఘటనపై సీఎం రఘుబర్ సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. సీఎం నిన్నటి సిద్ది బాత్ కార్యక్రమంలో జంషెడ్‌పూర్‌కు చెందిన బాలిక ఈ ఫిర్యాదు చేసింది. ఎంజీఎం పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జీ, డీఎస్‌పీ ర్యాంకు అధికారితో పాటు మరో ముగ్గురు తనపై అత్యాచారం జరిపారని.. అంతేకాకుండా వీడియో తీసి బెదిరింపులకు గురిచేస్తున్నారని సీఎంతో పేర్కొంది.
 
సీఎం ఆదేశానుసారం చర్యలు చేపట్టిన జంషెడ్‌పూర్ ఎస్పీ అనూప్ స్పందిస్తూ.. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి జూడిషియల్ కస్టడీకి తరలించినట్లు పేర్కొన్నారు. బాలికకు న్యాయం జరిగేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments