Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మసాజ్ పేరుతో వ్యభిచార దందా.. విటులతో ముగ్గురమ్మాయిలు...

దేశ ఐటీ రాజధానిగా వెలుగొందుతున్న బెంగుళూరు నగరంలో హైటెక్ వ్యభిచారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ముఖ్యంగా స్పా మసాజ్ సెంటర్ల పేరుతో ఈ వ్యభిచార దందాను గుట్టుచప్పుడుకాకుండా కొనసాగిస్తున్నారు. తాజ

మసాజ్ పేరుతో వ్యభిచార దందా.. విటులతో ముగ్గురమ్మాయిలు...
, మంగళవారం, 31 జులై 2018 (13:50 IST)
దేశ ఐటీ రాజధానిగా వెలుగొందుతున్న బెంగుళూరు నగరంలో హైటెక్ వ్యభిచారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ముఖ్యంగా స్పా మసాజ్ సెంటర్ల పేరుతో ఈ వ్యభిచార దందాను గుట్టుచప్పుడుకాకుండా కొనసాగిస్తున్నారు. తాజాగా ఓ మసాజ్ సెంటర్‌లో ముగ్గురమ్మాయిలతో విటులు ఎంజాయ్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగళూరులోని ఇందిరానగర్‌లోని 13జి మెయిన్ వాణిజ్య భవనంలో వరలక్ష్మీ (45) అనే మహిళ స్పా పేరిట ఓ మసాజ్ సెంటర్ నిర్వహిస్తోంది. తమ సెంటర్‌కు వచ్చే ఖాతాదారులకు మసాజ్ చేసేందుకు పలువురు అందమైన అమ్మాయిలను నియమించింది. 
 
ఈ సెంటర్‌కు వచ్చే ఖాతాదారులు కోరిక మేరకు వారికి అమ్మాయిలను సరఫరా చేస్తుంది. స్పాలో సెక్స్ రాకెట్ సాగుతుందని అందిన సమాచారంతో బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆకస్మికంగా దాడి చేయగా ముగ్గురు అమ్మాయిలు, విటులు చిక్కారు. 
 
ఈ అమ్మాయిల్లో బెంగళూరుకు చెందిన ఓ యువతితోపాటు నాగాలాండ్, అసోంకు చెందిన అమ్మాయిలు ఉన్నారు. వీరిని ప్రభుత్వ మహిళా సదనానికి తరలించారు. వారి నుంచి 3,500 రూపాయల నగదు, సెల్ ఫోన్లు, స్వైపింగ్ మిషన్, విటుల ఫోన్ నంబర్ల జాబితాలు దొరికాయి. పోలీసులు స్పా నిర్వాహకురాలైన వరలక్ష్మీతో పాటు.. పలువురు ఖాతాదారులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆధార్ నెంబర్ వుంటే హ్యాక్ చేయడం సులభం.. మోదీ మీ నెంబర్ ఇస్తారా?