Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ పెడ్లర్స్ కొత్త రూటు.. ఎల్‌పీజీ సిలిండర్‌లో గంజాయిని దాచి..?

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (10:28 IST)
ఉత్తరప్రదేశ్‌లోని డ్రగ్స్ పెడ్లర్స్ కొత్త రూటును ఎంచుకున్నారు. ఎల్‌పీజీ సిలిండర్‌లో గంజాయిని దాచి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన స్మగ్లర్లలో ఒకరు ఆగ్రా నివాసి కాగా, మరొకరు ఫరూఖాబాద్‌కు చెందినవారు. 
 
ఎల్‌పీజీ సిలిండర్లతో బైక్‌పై మెయిన్‌పురి పరిధిలోని బిచ్వాన్ ప్రాంతం గుండా వెళ్తున్నారు. అనుమానంతో పోలీసులు తనిఖీ చేయగా యువకులిద్దరూ ఖాకీలను తప్పుదోవ పట్టించారు. వారి మాటలు తేడాగా ఉండటంతో పోలీసులు గ్యాస్ సిలిండర్‌ను పరిశీలించగా దాని బరువు సాధారణం కంటే ఎక్కువగా ఉంది. 
 
దీంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. ఇద్దరు యువకులను గట్టిగా విచారించగా, సిలిండర్‌లో గంజాయి నింపినట్లు అంగీకరించారు. నిందితులను లఖన్, శివమ్‌లుగా గుర్తించారు. పట్టుబడిన స్మగ్లర్ల వెనుక పెద్ద రాకెట్ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments