Webdunia - Bharat's app for daily news and videos

Install App

తైవాన్ ఆగ్నేయ తీరంలో భారీ భూకంపం - రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (10:17 IST)
తైవాన్ ఆగ్నేయ తీరాన్ని భారీ భూకంపం ఒకటి కుదిపేసింది. సోమవారం సంభవించిన ఈ భూకంప తీవ్రత భూకంప లేఖినిపై 7.2గా నమోదైనట్టు తొలుత ప్రకటించారు. ఆ తర్వాత దీన్ని 6.9కు తగ్గించారు. ఈ మేరకు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూప్రకంపనల ప్రభావం కారణంగా 146 మంది గాయపడ్డారు.
 
ఈ భారీ భూకంప కేంద్రాన్ని తైటుంగ్ పట్ణానికి ఉత్తరంగా 50 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతున గుర్తించారు. ఇదే ప్రాంతంలో ఆదివారం 6.6 తీవ్రతతో భూకంపం సంభవించగా, సోమవారం అంతకుమించి తీవ్రతతో భూమి కంపించడం ప్రజలను భయాందోళకు గురిచేసింది. భారీ భూప్రకంపలకు పట్టాలపై ఉన్న రైళ్లు సైతం ఊగిపోయాయంటే దీని తీవ్రత ఎంత మేరకు ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
 
మరోవైపు, ఈ భూకంప తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జపాన్ ఆధీనంలో దీవులకు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. భారీ స్థాయిలో ప్రకంపనలు రావడంతో ఇళ్ల నుంచి, షాపింగ్ మాల్స్ నుంచి ప్రజలు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ భూకంపం తాలూకు ప్రకంపనలు రాజధాని తైపేలోనూ కనిపించినట్టు ఓ ప్రతినిధి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన డూ యు వాన్నా పార్టనర్ రాబోతుంది

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

తర్వాతి కథనం
Show comments