Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్ నుంచి అనేక విషయాలు నేర్చుకోవాలి : రిషి సునక్

Rishi Sunak
, బుధవారం, 24 ఆగస్టు 2022 (09:57 IST)
బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన రిషి సునక్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా లండన్‌లో ప్రవాస భారతీయులు ఏర్పాటుచేసిన ఓ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అడిగిన అనేక ప్రశ్నలకు ఆర్థిక శాఖ మాజీ మంత్రి సూటిగా, స్పష్టంగా సమాధానమిచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్, బ్రిటన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఎంతో కీలకం. ఇరు దేశాల మధ్య బ్రిటన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. భారత్‌లో మన దేశ వస్తు ఉత్పత్తుల వ్యాపారానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఇరు దేశాల దౌత్య సంబంధాల్లో పెను మార్పులు చోటు చేసుకోవడాన్ని ఇష్టపడుతున్నాను. ముఖ్యంగా భారత్ నుంచి అనేక విషయాలు నేర్చుకోవాల్సివుంది. అందువల్ల మన దేశానికి చెందిన విద్యార్థులను, మన వ్యాపార సంస్థలను భారత్‌కు వెళ్లేందుకు మరింత సులభతరం చేసేందుకు కృషి చేస్తాను అని వివరించారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శతాధిక వృద్ధుడు ఈటల మల్లయ్య మృతి