Webdunia - Bharat's app for daily news and videos

Install App

లఖింపూర్‌ ఘటన: అజయ్ మిశ్రా కుమారుడికి నోటీసులు

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (19:01 IST)
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో రైతుల పైకి కారుతో దూసుకుపోయిన కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయకపోవడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీ పోలీసులు స్పందించారు.
 
రైతుల మృతికి కారకుడంటూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాకు ఎట్టకేలకు నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. లఖింపూర్ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని లక్నో ఐజీ లక్ష్మీ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతానికి ఇద్దరు అనుమానితులను విచారిస్తున్నామని తెలిపారు. 
 
కాగా, ఈ వ్యవహారంలో కేంద్రమంత్రి తనయుడు ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్న పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను యూపీ పోలీసులు షాజహాన్ పూర్ వద్ద అడ్డుకున్నారు. సిద్ధూ ఇద్దరు పంజాబ్ మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలతో కలిసి లఖింపూర్ వెళుతుండగా, పోలీసులు వారి వాహనాలను నిలిపివేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments