Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్పెల్లింగ్ నేర్పస్తానంటూ విద్యార్థినిని గదిలోకి పిలిపించుకుని...

స్పెల్లింగ్ నేర్పస్తానంటూ విద్యార్థినిని గదిలోకి పిలిపించుకుని...
, మంగళవారం, 5 అక్టోబరు 2021 (14:56 IST)
ఇద్దరు విద్యార్థినులపై ఓ పాఠశాల డైరెక్టర్ కన్నేశాడు. స్పెల్లింగ్ నేర్పిస్తానని ఒక విద్యార్థిని తన గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డడాడు. ఈ దారుణ సంఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ పట్టణంలో చోటుచేసుకుంది.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... రాజ్‌కోట్‌ లోధిక తాలుకాకు చెందిన దినేష్ జోషి అనే వ్యక్తి ఓ ప్రైవేటు పాఠశాలకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 
 
ఇటీవల కరోనా వ్యాప్తి శాంతించడంతో పాఠశాలలు తెరుచుకున్నాయి. దినేశ్‌ జోషి కొన్ని రోజుల క్రితం స్పెల్లింగులు నేర్పిస్తానంటూ ఇద్దరు బాలికలను తన రూమ్‌కి రమ్మని పిలిచాడు. దీంతో ఆ ఇద్దరు విద్యార్థులు గదిలోకి వెళ్లిన కొద్దిసేపటికే వారితో అసభ్యకరంగా ప్రవర్తించాడు.
 
అక్కడి నుంచి వచ్చిన అనంతరం ఓ బాలిక ఈ విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పింది. మరో అమ్మాయి తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలిసింది. వీరిద్దరేగాక అతని ప్రవర్తన అందరితో ఇలానే ఉండేదని పోలీసులు తెలిపారు. 
 
ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఇతర బాధిత విద్యార్థులు అంతకుముందు తమపై జరిగిన దారుణాల గురించి చెప్పారు. దీంతో దాదాపు వంద మంది తల్లిదండ్రులు, విద్యార్థినులు లోధిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జోషిపై ఫిర్యాదు చేశారు. నిందితుడు జోషి భార్య సీమా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

24 గంటల్లో కొత్తగా 18,346 కరోనా కేసులు.. 209 రోజుల్లో?