Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎఫ్‌బి - వాట్సాప్ సేవలకు అంతరాయం : రూ.52 వేల కోట్ల నష్టం

ఎఫ్‌బి - వాట్సాప్ సేవలకు అంతరాయం : రూ.52 వేల కోట్ల నష్టం
, మంగళవారం, 5 అక్టోబరు 2021 (13:31 IST)
ప్రముఖ సోషల్ మీడియా ప్రసార మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు ఆరు గంటల పాటు స్తంభించిపోయాయి. సోమవారం సాయంత్రం గత రాత్రి 9 గంటల సమయంలో సామాజిక మాధ్యమాల సేవలన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. పిమ్మట ఏడు గంటల తర్వాత ఈ సేవలన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఫేస్‌బుక్.. సేవల పునరుద్ధరణకు నడుం బిగించింది. 
 
దాదాపు 7 గంటలపాటు ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా సేవలు నిలిచిపోవడంతో ఈ మూడింటి మాతృసంస్థ ఫేస్ బుక్ స్పందించింది. ఈ అంతరాయానికి చింతిస్తున్నామంటూ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఓ పోస్ట్ చేశాడు. మీకు ఇష్ట‌మైన వారితో స‌న్నిహితంగా ఉండేందుకు ఫేస్‌బుక్‌, ఇన్‌‌స్టా, వాట్సాప్ ఎంతగా ఉపయోగపడుతున్నాయో తమకు తెలుసని.. ప్రస్తుతం అంతా ఓకే అని చెప్పాడు. యూజర్లు అందరూ తమను క్ష‌మించాలని జుకర్ బర్గ్ కోరాడు.
 
సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 4 గంటల దాకా ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టా సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కార‌ణాల‌తో ఈ మూడు సేవ‌లు నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు ఎన్నో ఇబ్బందులుపడ్డారు. మరోవైపు 7 గంటల అంతరాయానికి జుక‌ర్ బ‌ర్గ్‌ భారీగానే మూల్యం చెల్లించుకున్నాడు. సుమారు 7 బిలియన్ల డాలర్లు.. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.52 వేల కోట్లకుపైగా నష్టం వచ్చినట్లుగా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. నిజానికి ఫేస్‌బుక్ వచ్చినప్పటి నుంచి ఇంత సమయంలో సర్వీసులు నిలిచిపోవడం ఇదే తొలిసారి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీపీఎస్సి జూనియర్‌ అసిస్టెంట్స్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌