Webdunia - Bharat's app for daily news and videos

Install App

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

ఠాగూర్
బుధవారం, 23 ఏప్రియల్ 2025 (14:56 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడి నుంచి కేరళ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు తృటిలో తప్పించుకున్నారు. ఈ విషయాన్ని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. కేరళ హైకోర్టుకు చెందిన జస్టిస్ అనిల్ నరేంద్రన్, జస్టిస్ పీజీ అజిత్ కుమార్, జస్టిస్ జి గిరీష్‌లతో పాటు ఎమ్మెల్యేలు ముఖేశ్, కేపీఏ మజీద్, టీ సిద్ధిక్, కె.అన్నాలన్‌ ఇటీవల జమ్మూకాశ్మీర్ ‌పర్యటనకు వెళ్లారు. 
 
వీరంతా పహల్గాం సమీపంలో ఉగ్రవాదులు జరిపిన దాడికి అతి సమీపంలోనే బస చేసివున్నారు. అయితే, అదృష్టవశాత్తూ వీరికి ఎలాంటి అపాయం జరగలేదు. ప్రస్తుతం ఈ బృందం మొత్తం శ్రీనగర్‌లో క్షేమంగా ఉందని, వారిని సురక్షితంగా కేరళ తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
అయితే, దురదృష్టవశాత్తు ఉగ్రదాడిలో కేరళ రాష్ట్రంలోని కొచ్చి ఎడవల్లికి చెందిన పర్యాటకుడు ఎన్.రామచంద్రన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రామచంద్రన్ మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం.. మృతుడు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, వారిని సురక్షితంగా స్వస్థలానికి చేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పహల్గాం సమీపంలోని బైసరన్ లోయ వద్ద సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులే లక్ష్యంగా పైశాచిక దాడికి తెగబడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments