Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీ కాళ్లు కడిగిన నీళ్లు తీర్థంలా భావించి తాగిన బీజేపీ కార్యకర్త

అతిభక్తి పనికిరాదంటారు. కానీ, ఈ బీజేపీ కార్యకర్తకు మాత్రం అతిభక్తే ముద్దుగా అనిపిస్తోంది. అందుకే, తమ ఎంపీ కాళ్లు కడిగిన నీళ్లు పరమ పవిత్రమైన తీర్థంగా భావించి సేవించాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగి

Webdunia
మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (09:27 IST)
అతిభక్తి పనికిరాదంటారు. కానీ, ఈ బీజేపీ కార్యకర్తకు మాత్రం అతిభక్తే ముద్దుగా అనిపిస్తోంది. అందుకే, తమ ఎంపీ కాళ్లు కడిగిన నీళ్లు పరమ పవిత్రమైన తీర్థంగా భావించి సేవించాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
జార్ఖండ్‌ రాష్ట్రంలోని గొడ్డా సెగ్మెంట్ ఎంపీ నిషికాంత్‌ ఇటీవల తన నియోజకవర్గంలో పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా, కన్హావరా అనే గ్రామానికి వెళ్లారు. ఓ బ్రిడ్జిని నిర్మిస్తానని ప్రకటించిన దూబే ప్రసంగం పూర్తి కాగానే పళ్లెంతో వచ్చిన పవన్‌ అనే బీజేపీ కార్యకర్త ఎంపీ కాళ్లు కడిగాడు. 
 
అంతటితో ఆగక ఆ నీళ్లను తాగేశాడు. ఆ సమయంలో ఎంపీ అతణ్ని వారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ చర్యను ఆ కార్యకర్త సమర్థించుకున్నాడు. ఆయన తమకు అత్యంత ప్రియతమైన నేత అని, అందుకే అలా చేసినట్టు చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

"హరిహర వీరమల్లు" విడుదలకు ముందు వివాదం

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments