Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ మెయిన్ కీ ఫలితాల్లో హైదరాబాద్ కుర్రోడికి సత్తా

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (10:25 IST)
జేఈఈ మెయిన్ చివరి విడత పరీక్షా ఫలితాలకు సంబంధించిన తుది కీని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్.టి.ఏ) సోమవారం రాత్రి విడుదల చేసింది. ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు బీటెక్ సీట్లకోసం పేపర్ 1 పరీక్ష నిర్వహించింది. ప్రాథమిక కీని కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ఎన్టీఏ దానిపై అభ్యంతరాలను స్వీకరించింది. ఈ క్రమంలో సోమవారం తుది కీని విడుదల చేసింది. 
 
వీటిలో హైదరాబాద్ నగరానికి చెందిన సింగరాజు వెంకట్ కౌండిల్య 300కి 300 మార్కులు సాధించాడు. దీంతో ఆ విద్యార్థికి ర్యాంకు టాప్ - 10లో దక్కే అవకాశం ఉంది. కౌండిల్య పాఠశాల విద్య నుంచి ఇంటర్ వరకు హైదరాబాద్ నగరంలోని శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం చేశాడు. జూన్ నాలుగో తేదీన జరిగే జేఈఈ అడ్వాన్స్‌ పరీక్షల్లో ఉత్తర ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదువుతానని కౌండిల్య విశ్వాసం వ్యక్తం చేశాడు. 
 
మరోవైపు, జేఈఈ అడ్వాన్స్ పరీక్షల కోసం ఈ నెల 30వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభంకానుంది. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు కటాఫ్ మార్కులను నిర్ణయించింది. ఈ పరీక్ష రాసేందుకు దేశ వ్యాప్తంగా కేవలం 2.50 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అర్హులుగా తేలారు. వీరంతా ఈ నెల 30వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. తుది గడువును మే 7వ తేదీగా ఖరారు చేశారు. జూన్ 4వ తేదీన ఈ పరీక్షలు జరుగుతాయి. జూన్ 18న ఫలితాలను వెల్లడిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments