Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఆకలితో ఉంది.. తమిళనాడులా ఏపీని కూడా?: జేసీ

కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆకలితో ఉందని.. ఒక్కో రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలని చూస్తోందని టీడీపీ సీనియర్ నేత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు త

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (09:36 IST)
కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆకలితో ఉందని.. ఒక్కో రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలని చూస్తోందని టీడీపీ సీనియర్ నేత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు.  ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకుని మరీ కేంద్రం చుట్టూ తిరుగుతుంటే.. కేంద్రం మాత్రం ఆయన్ని నియంత్రించాలనుకుంటుందని చెప్పుకొచ్చారు.

అందుకే పోలవరం విషయంలో లేనిపోని సమస్యలు సృష్టిస్తోందని ఆరోపించారు. పోలవరం విషయంలో ఏవైనా అనుమానాలుంటే అడిగి తెలుసుకోవాలి కానీ పిలిచిన టెండర్లను ఆపాలనడం సరికాదని జేసీ చెప్పుకొచ్చారు. 
 
ఏపీని కేంద్రం చిన్నచూపు చూస్తోందని జేసీ విమర్శించారు. పోలవరాన్ని ఆపాలని ప్రయత్నిస్తే దేశంలో అతిపెద్ద తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందని జేసీ అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలవరానికి సృష్టిస్తున్న ప్రతిబంధకాలు పాలనాపరమైనవిగా అనిపించట్లేదన్నారు. అంతా రాజకీయ కారణాల వల్లే బీజేపీ అలా చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రం కనుక ఏపీతో వైరం పెట్టుకుంటే మూడేది వారికేనని జేసీ హెచ్చరించారు. 
 
అంతేగాకుండా బీజేపీపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో వుంచుకుని.. తమిళనాడులా ఏపీని కబళించాలనే ప్రయత్నాలు కేంద్రం పెద్దలు చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. 15 రోజుల్లో పోలవరం వ్యవహారం చక్కబడుతుందని, లేదంటే పార్లమెంట్‌లో పోరాడతామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments