Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఆకలితో ఉంది.. తమిళనాడులా ఏపీని కూడా?: జేసీ

కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆకలితో ఉందని.. ఒక్కో రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలని చూస్తోందని టీడీపీ సీనియర్ నేత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు త

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (09:36 IST)
కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆకలితో ఉందని.. ఒక్కో రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలని చూస్తోందని టీడీపీ సీనియర్ నేత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు.  ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకుని మరీ కేంద్రం చుట్టూ తిరుగుతుంటే.. కేంద్రం మాత్రం ఆయన్ని నియంత్రించాలనుకుంటుందని చెప్పుకొచ్చారు.

అందుకే పోలవరం విషయంలో లేనిపోని సమస్యలు సృష్టిస్తోందని ఆరోపించారు. పోలవరం విషయంలో ఏవైనా అనుమానాలుంటే అడిగి తెలుసుకోవాలి కానీ పిలిచిన టెండర్లను ఆపాలనడం సరికాదని జేసీ చెప్పుకొచ్చారు. 
 
ఏపీని కేంద్రం చిన్నచూపు చూస్తోందని జేసీ విమర్శించారు. పోలవరాన్ని ఆపాలని ప్రయత్నిస్తే దేశంలో అతిపెద్ద తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందని జేసీ అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలవరానికి సృష్టిస్తున్న ప్రతిబంధకాలు పాలనాపరమైనవిగా అనిపించట్లేదన్నారు. అంతా రాజకీయ కారణాల వల్లే బీజేపీ అలా చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రం కనుక ఏపీతో వైరం పెట్టుకుంటే మూడేది వారికేనని జేసీ హెచ్చరించారు. 
 
అంతేగాకుండా బీజేపీపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో వుంచుకుని.. తమిళనాడులా ఏపీని కబళించాలనే ప్రయత్నాలు కేంద్రం పెద్దలు చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. 15 రోజుల్లో పోలవరం వ్యవహారం చక్కబడుతుందని, లేదంటే పార్లమెంట్‌లో పోరాడతామని చెప్పారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments