రైల్ రిజర్వేషన్ టిక్కెట్ మరింత సులభం...

భారతీయ రైల్వే శాఖ ఓ శుభవార్త తెలిపింది. రైల్ టిక్కెట్ రిజర్వేషన్‌‍ను మరింత సులభతరం చేసింది. ఇకపై భీమ్, యూపీఐ యాప్‌ల ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని తీసుకొచ్చింది.

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (09:18 IST)
భారతీయ రైల్వే శాఖ ఓ శుభవార్త తెలిపింది. రైల్ టిక్కెట్ రిజర్వేషన్‌‍ను మరింత సులభతరం చేసింది. ఇకపై భీమ్, యూపీఐ యాప్‌ల ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని తీసుకొచ్చింది. డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది రైల్వే ప్రయాణికులకు ఊరట లభించనుంది. 
 
దేశంలోని అన్ని టికెట్ రిజర్వేషన్ కౌంటర్లలో శుక్రవారం నుంచి యూపీఐ చెల్లింపు వ్యవస్థను అమలు చేస్తున్నట్టు ఇండియన్ రైల్వే ప్రకటించింది. దీంతో ఇకపై ప్రయాణికులు తమ టికెట్ బుకింగ్ కోసం క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించాల్సిన అవసరం లేదు. మొబైల్‌లోని భీమ్ యాప్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చని వివరించారు. 
 
దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 7.5 లక్షల టికెట్లు బుక్ అవుతుండగా దాదాపు 97 శాతం బుకింగ్‌లు నగదు చెల్లింపుల ద్వారా జరుగుతుండగా మూడు శాతం మాత్రమే డిజిటల్ రూపంలో జరుగుతున్నాయి. దీంతో నగదు చెల్లింపులు తగ్గించి, డిజిటల్ లావాదేవీలను పెంచే చర్యల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం