Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.925 కోట్ల దోపిడీని అడ్డుకున్న కానిస్టేబుల్... ఎలా?

ఓ కానిస్టేబుల్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఏకంగా రూ.925 కోట్ల దోపిడీని అడ్డుకున్నాడు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో జరిగింది.

Webdunia
బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (14:59 IST)
ఓ కానిస్టేబుల్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఏకంగా రూ.925 కోట్ల దోపిడీని అడ్డుకున్నాడు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, జైపూర్ నగరంలో సి.స్కీమ్ ప్రాంతంలోని ఓ స్థానిక బ్యాంకులో దోపిడీ చేసేందుకు 13 మంది దోపిడీ దొంగలు సోమవారం అర్థరాత్రి వచ్చారు. అపుడు సమయం సరిగ్గా అర్థరాత్రి 2.30 గంటలు. 
 
బ్యాంకు ప్రధాన ద్వారం షట్టర్‌ను తొలగించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా, కాపలా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సీతారామ్ వెంటనే కాల్పులు జరుపుతూ అలారమ్ ఆన్ చేశాడు. దాంతో వచ్చిన దుండగులు వాహనంలో పారిపోయారు. 
 
పెద్ద శబ్దంతో అలారం మోగడంతో ఆ ప్రాంతానికి స్థానికులతో పాటు పోలీసులు కూడా నిమిషాల్లో చేరుకున్నారు. ఆ తర్వాత పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను తీసుకుని పరిశీలిస్తున్నారు. ఈ బ్యాంకు నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని శాఖలకు నగదును పంపే కేంద్రంగా పనిచేస్తుండటం గమనార్హం.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments