Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.925 కోట్ల దోపిడీని అడ్డుకున్న కానిస్టేబుల్... ఎలా?

ఓ కానిస్టేబుల్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఏకంగా రూ.925 కోట్ల దోపిడీని అడ్డుకున్నాడు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో జరిగింది.

Webdunia
బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (14:59 IST)
ఓ కానిస్టేబుల్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఏకంగా రూ.925 కోట్ల దోపిడీని అడ్డుకున్నాడు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, జైపూర్ నగరంలో సి.స్కీమ్ ప్రాంతంలోని ఓ స్థానిక బ్యాంకులో దోపిడీ చేసేందుకు 13 మంది దోపిడీ దొంగలు సోమవారం అర్థరాత్రి వచ్చారు. అపుడు సమయం సరిగ్గా అర్థరాత్రి 2.30 గంటలు. 
 
బ్యాంకు ప్రధాన ద్వారం షట్టర్‌ను తొలగించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా, కాపలా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సీతారామ్ వెంటనే కాల్పులు జరుపుతూ అలారమ్ ఆన్ చేశాడు. దాంతో వచ్చిన దుండగులు వాహనంలో పారిపోయారు. 
 
పెద్ద శబ్దంతో అలారం మోగడంతో ఆ ప్రాంతానికి స్థానికులతో పాటు పోలీసులు కూడా నిమిషాల్లో చేరుకున్నారు. ఆ తర్వాత పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను తీసుకుని పరిశీలిస్తున్నారు. ఈ బ్యాంకు నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని శాఖలకు నగదును పంపే కేంద్రంగా పనిచేస్తుండటం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments