Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తల్లికి వివాహం చేసిన పెళ్లీడుకొచ్చిన కుమార్తె .. ఎక్కడ? ఎలా?

సాధారణంగా తమ బిడ్డలకు తల్లిదండ్రులు వివాహాలు చేస్తుంటారు. కానీ, ఇక్కడ ఓ తల్లికి పెళ్లీడుకొచ్చిన కుమార్తె వివాహం చేసింది. రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌ నగరంలో వెలుగు చూసిన పెళ్లి కథను తెలుసుకుందాం.

Advertiesment
Jaipur
, గురువారం, 11 జనవరి 2018 (12:11 IST)
సాధారణంగా తమ బిడ్డలకు తల్లిదండ్రులు వివాహాలు చేస్తుంటారు. కానీ, ఇక్కడ ఓ తల్లికి పెళ్లీడుకొచ్చిన కుమార్తె వివాహం చేసింది. రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌ నగరంలో వెలుగు చూసిన పెళ్లి కథను తెలుసుకుందాం.
 
జైపూర్ నగరంలో గీతా అగర్వాల్ (53) పాఠశాల ఉపాధ్యాయురాలు. ఈమె భర్త ముకేష్ గుప్తా. వీరికి సంహిత అనే కుమార్తె ఉంది. అయితే, గత 2016 మే నెలలో ముకేష్ గుప్తా గుండెపోటుతో మరణించాడు. దీంతో గీతా విషాదంలో మునిగిపోయింది. తండ్రి ఆకస్మిక మరణంతో వితంతువుగా మారిన తల్లి నిరాశ చెందడం చూసిన కుమార్తె జీర్ణించుకోలేక పోయింది. 
 
ఎలాగైనా తన తల్లిని మామూలు మనిషిని చేయాలని నిర్ణయించుకుంది. దీంతో తల్లి ప్రొఫైల్‌ను తయారు చేసి దానిలో తన ఫోన్ నంబరు ఇచ్చి రెండోపెళ్లికి ప్రకటన ఇచ్చింది. ఈ ప్రకటన చూసిన ఓ వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చాడు. ఆయనకు భార్య కేన్సర్‌తో మరణించింది. పైగా, రెవెన్యూ ఇన్‌స్పెక్టరు. పేరు కేజీగుప్తా. 
 
వీరిద్దరి పెళ్లికి గీతా అగర్వాల్ కుటుంబసభ్యులు, బంధుమిత్రులందరూ వ్యతిరేకించారు. అయినా సంహిత మాత్రం పెళ్లి పెద్దగా మారి తల్లికి గుప్తాతో రెండో పెళ్లి చేసింది. పెళ్లికి ముందే తల్లికి గర్భాశయాన్ని తొలగిస్తూ శస్త్రచికిత్స చేయించి పెళ్లి జరిపించింది. రెండో పెళ్లి అనంతరం తల్లి ముఖంలో విరిసిన చిరునవ్వు చూసి కుమార్తె సంహిత ఆనందానికి అవధుల్లేకండా పోయాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేస్‌బుక్, వాట్సాప్‌లు వాడే అమ్మాయిలా? వద్దే వద్దంటున్న యువకులు?