Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇస్రోను కూడా ప్రైవేటుపరం చేస్తున్నారా? ఛైర్మన్ శివన్ ఏమంటున్నారు?

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (22:54 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను కూడా ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రైల్వే శాఖలో ప్రైవేటు రైళ్ళు నడిపేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అలాగే, అంతరిక్ష పరిశోధనలు జరిపే ఇస్రోను కూడా ప్రైవేటుపరం చేయనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై ఇస్రో ఛైర్మన్ కె. శివన్ నాయర్ స్పష్టతనిచ్చారు. 
 
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను ప్రైవేటుపరం చేయనున్నారంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన గురువారం తోసిపుచ్చారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో అనేక సంస్కరణలు తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిందని, ఇస్రో ప్రైవేటుపరం కాదని గుర్తుచేశారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో సంస్కరణల ప్రకటన ప్రైవేటీకరణకు ఉద్దేశించినది ఎంతమాత్రం కాదని స్పష్టతనిచ్చారు. 
 
'ప్రభుత్వం అంతరిక్ష రంగంలో సంస్కరణలు తెస్తున్నట్టు ప్రకటించగానే కొందరు ఇస్రోను ప్రైవేటుపరం చేస్తారనే అపోహలను తెరపైకి తెచ్చారు. అలాంటిదేమీ లేదు. ఇస్రో ప్రైవేటుపరం కాదని పదేపదే నేను చెబుతూనే ఉన్నాను' అని శివన్ గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments