Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పలుతెప్పలుగా కరోనా కేసులు.. అయినా మద్యం షాపులు తెరుస్తారట...

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (18:04 IST)
దేశంలో అత్యధిక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఈ వైరస్ వ్యాప్తి అడ్డుకట్టకు ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ... ప్రతి రోజూ కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఆ రాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం 50 మందికి పైగా జర్నలిస్టులకు కూడా ఈ వైరస్ సోకింది. ఇక్కడ పరిస్థితులు దిగజారిపోతుంటే.. మహారాష్ట్ర సర్కారు మాత్రం మద్యం దుకాణాలు తెరిచేందుకు అమితాసక్తిని ప్రదర్శిస్తోంది. 
 
ఇదే అంశంపై ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపె స్పందిస్తూ, 'ప్రజలు కనుక భౌతిక దూరాన్ని పాటించినట్లయితే మద్యం దుకాణాలను మూసేయాల్సిన అవసరం ఏముంది? కరోనాను కట్టడి చేయాలంటే కాస్త కఠినంగానే వ్యవహరించాలి. మద్యంపై నిషేధం అందులో భాగమే' అని వివరించారు. మహారాష్ట్రలో సోమవారం నుంచి పాక్షిక స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమైన విషయం తెల్సిందే. 
 
లాక్‌డౌన్ వల్ల మద్యం బాబులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మందుకు దూరంగా ఉండలేక, అలా అని దాన్ని సాధించుకోలేక మానసిక ఇబ్బందులకు గురి అవుతున్నారు. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో వస్తున్న కేసులే ఇందుకు ప్రత్యక్ష ఉదహారణ. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా దాదాపుగా దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments