Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహారాష్ట్రలో 3వేలకు దాటిన కరోనా కేసుల సంఖ్య

Advertiesment
Maharashtra
, గురువారం, 16 ఏప్రియల్ 2020 (15:38 IST)
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 3089కి చేరింది. గత 24గంటల్లో 165 కొత్త కేసులు నమోదైనాయి. కాగా ఒక్క ముంబైలోనే కొత్తగా 107 కేసులు నమోదయ్యాయి. ఔరంగాబాద్‌లో ఇద్దరికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు. అతిపెద్ద మురికివాడ ధారావిలో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. గత 24 గంటల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
కేంద్రం తాజాగా హాట్‌స్పాట్‌ (రెడ్‌ జోన్‌) జిల్లాలు, ప్రాంతాల జాబితాను విడుదల చేసింది. కాగా, దేశరాజధాని ఢిల్లీతో సహా దేశంలోని ఆరు మహా నగరాలైన ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై నగరాలతో పాటు జైపూర్‌, ఆగ్రాలను కూడా ఆ జాబితాలో చేర్చారు.
 
కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న 123 జిల్లాలు కూడా రెడ్‌జోన్ల పరిధిలోకి వచ్చాయి. దేశంలో లేదా సంబంధిత రాష్ట్రంలోని మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల్లో 80 శాతానికి పైగా కలిగి ఉన్న ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమ్మోళ్ళు తలచుకుంటే ... జగన్ లేచిపోతారని అనలేదు : రాయపాటి