Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెకాలో కేరళ వైద్యురాలికి అరుదైన గౌరవం

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (17:56 IST)
కరోనా వైరస్ బాధిత దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా ఒకటి. ఈ దేశ వాణిజ్య నగరమైన న్యూయార్క్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేసింది. ఇప్పటికి కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పురాలేదు. అయినప్పటికీ కరోనా వైరస్ కట్టడికి ఆ దేశ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇండో - అమెరికన్ వైద్యురాలికి ఓ అరుదైన గౌరవం లభించింది. కరోనా వైరస్ రోగులకు చికిత్స చేసినందుకుగాను ఆమెకు ఈ గౌరవం దక్కిది. అదీ కూడా వంద కార్ల ర్యాలీతో సెల్యూట్ ప్యారెడ్ నిర్వహించారు. 
 
ఈ వైద్యురాలు అమెరికాలోని సౌత్ విండర్స్ ఆస్పత్రిలో పని చేస్తోంది. మైసూర్‌కు చెందిన ఈ వైద్యురాలి పేరు డాక్టర్ ఉమా మధుసూదనన్. అమెరికాలో స్థిరపడిపోయారు. ఈమె కరోనా రోగులకు వైద్యం చేసినందుకుగాను... ఆమె ఇంటి ముందు నుంచి వందకార్లు వెళుతూ, కొన్ని నిమిషాల పాటు ఆపి సెల్యూట్ చేశారు. 
 
ఈ కార్ల ర్యాలీలో అనేక పోలీసు వాహనాలతో పాటు ఫైర్ బ్రిగేడ్ ట్రక్కులు, ప్రైవేట్ వాహనాలు కూడా ఉన్నాయి. కనీసం 100 వాహనాల కాన్వాయ్ డాక్టర్ ఉమా ఇంటిని కొన్ని సెకన్ల పాటు ఆపి, ఆమెకు కృతజ్ఞతలు తెలిపింది.

 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments