Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫామ్‌హౌస్‌లో భర్తను కట్టేసి.. భార్యపై సామూహిక అత్యాచారం

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (10:33 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని మహేశ్వరంలో భర్త కళ్లెదుటే భార్యపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. హైదరాబాద్, పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే, నాగర్‌కర్నూలు జిల్లా ఎనిమిల్లతండాకు చెందిన చందు భార్యాపిల్లలతో కలిసి మహేశ్వరం మండలంలోని హర్షగూడలో నివసిస్తూ స్థానికంగా ఉండే ఓ ఫామ్‌హౌస్‌లో పని చేస్తున్నాడు. 
 
ఈ క్రమంలో ఈ నెల 18వ తేదీన ఫాంహౌస్ యజమానులు రంగారెడ్డి, ప్రతాప్‌ రెడ్డిలతో గొడవ పడ్డాడు. ఇది కాస్తా పెద్దది కావడంతో చందు, అతడి భార్యను వారు ఫాంహౌస్‌లో బంధించారు. అనంతరం చందు భార్యను మరో గదిలోకి తీసుకెళ్లి రంగారెడ్డి, ప్రతాప్‌ రెడ్డితోపాటు మరో ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments