Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో రంకుబాగోతానికి అడ్డొస్తున్నాడనీ...

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (10:25 IST)
ప్రియుడితో రంకుబాగోతానికి అడ్డొస్తున్నాడనీ భర్తకు కట్టుకున్న భార్య అన్నంలో విషం కలిపిపెట్టి హత్య చేసింది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లా గూడూరు మండలంలో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మండలంలోని మూడు గుడిసెల తండాకు చెందిన మాలోత్ మోహన్ (30), పావని అనే దంపతులు ఉండగా, వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, అదే గ్రామానికి చెందిన అజ్మీర శ్రీను అనే యువకుడుతో పావని అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త దీనిని పెద్దమనుషుల దృష్టికి తీసుకెళ్లాడు. పంచాయితీ పెట్టిన పెద్దలు పావనిని మందలించారు.
 
దీంతో భర్తపై కక్ష పెంచుకున్న పావని.. ప్రియుడు శ్రీనుతో కలిసి భర్తను అడ్డుతొలగించుకునేందుకు ప్లాన్ వేసింది. అందులోభాగంగా బుధవారం మధ్యాహ్నం విషం కలిపిన ఆహారాన్ని అతడికి అందించింది. అది తిన్న మోహన్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. 
 
గమనించిన మోహన్ తల్లి హేమ్లీ, గ్రామస్థుల సాయంతో కుమారుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. మోహన్ తల్లి ఫిర్యాదుపై గురువారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments