Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపుడే ప్రజాస్వామ్యం ఖూనీ అయింది : అమిత్ షా

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కాంగ్రెస్ - జేడీఎస్‌లు జట్టుకట్టినపుడే ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. కర్ణాటక వ్యవహారంపై రాహుల్‌ ఘా

Webdunia
శుక్రవారం, 18 మే 2018 (08:53 IST)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కాంగ్రెస్ - జేడీఎస్‌లు జట్టుకట్టినపుడే ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. కర్ణాటక వ్యవహారంపై రాహుల్‌ ఘాటైన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. వీటికి అమిత్ షా కౌంటరిచ్చారు.
 
'కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడికి బహుశా తమ పార్టీ 'ఘనమైన' చరిత్ర గురించి గుర్తులేదనుకుంటా. వారి పార్టీ చరిత్రంతా ఎమర్జెన్సీ, ఆర్టికల్‌ 356 దుర్వినియోగం, కోర్టులు, మీడియా, పౌరసమాజాన్ని వినాశనం చేయడంతో నిండి ఉంది' అని గుర్తుచేశారు. 
 
'కర్ణాటకలో ప్రజా తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంది? 104 సీట్లు గెలిచిన బీజేపీకా? లేక 78 సీట్లకు పడిపోయిన కాంగ్రెస్‌ పార్టీకా?' అని ప్రశ్నించారు. యడ్డి సర్కారుకు బలనిరూపణకు గవర్నర్‌ 15 రోజులు సమయం ఇవ్వడాన్ని కాంగ్రెస్‌ ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడంగా అభివర్ణిస్తోందని మండిపడ్డారు. 'తన రాజకీయ ప్రయోజనాల కోసం జేడీఎస్‌కు కాంగ్రెస్‌ మద్దతిస్తామంటూ ఆఫర్‌ ఇచ్చిన క్షణమే ప్రజాస్వామ్యం హత్యకు గురైంది' అని ఘాటుగా స్పందించారు. 
 
కానీ, బీహార్, గోవా, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో బీజేపీ వ్యవహారించిన తీరుపై మాత్రం ఆయన ఏమాత్రం స్పందించలేదు. పైపెచ్చు.. బీహార్‌లో ఆర్జేడీ, మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ బీజేపీ అడ్డదారుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వీటిపై మాత్రం అమిత్ షా స్పందించక పోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments