Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రికార్డు సృష్టించిన కర్ణాటక ఎన్నికలు: మోదీ ప్రచారంతోనే ఖర్చు పెరిగిందట..

దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా కర్ణాటక ఎన్నికలు రికార్డు సృష్టించాయి. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ భారీగా డబ్బు వెచ్చించాయి. కర్ణాటక ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపు కోసం వివిధ పార్టీలు రూ. 9,500

Advertiesment
Karnataka Election Result
, మంగళవారం, 15 మే 2018 (09:00 IST)
దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా కర్ణాటక ఎన్నికలు రికార్డు సృష్టించాయి. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ భారీగా డబ్బు వెచ్చించాయి. కర్ణాటక ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపు కోసం వివిధ పార్టీలు రూ. 9,500 నుంచి రూ.10,500 కోట్లు ఖర్చు చేసినట్లు తేలింది. ఈ మొత్తం 2013 ఎన్నికల్లో ఆయా పార్టీలు ఖర్చు చేసిన దానికి రెట్టింపు. 
 
ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం నిమిత్తం ఈ ఖర్చు పెరిగిందని సీఎంఎస్‌కు చెందిన ఎన్. భాస్కరరావు చెప్పారు. ఈ ఎన్నికల ఖర్చు 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఖర్చు రూ.50వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్లకు చేరుకుంటుందని సీఎంఎస్ అంచనా వేసింది. 
 
కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత బ్యాలెట్ బాక్సులను తెరిచి తొలి రౌండ్ ఓట్లను అధికారులు లెక్కిస్తుండగా, 160 స్థానాల్లో ట్రెండ్స్ వెలువడ్డాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#KarnatakaVerdict : బీజేపీ ఆధిక్యం.. కాంగ్రెస్ వెనుకంజ.. కింగ్ మేకర్ జేడీఎస్