Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాడ్సేపై పొగడ్తలు - గాంధీపై విమర్శలు.. కాళీచరణ్ మహారాజ్ అరెస్టు

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (12:17 IST)
చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన కాళీచరణ్ మహరాజ్ నోటిదూలను ప్రదర్శించి జైలుపాలయ్యాడు. జాతిపిత మహాత్మా గాంధీని దూషించి, గాంధీని చంపిన గాడ్సేపై పొగడ్తల వర్షం కురిపించాడు. అలాగే, ఇస్లాం మతాన్ని కించపిరిచేలా వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై కేసు నమోదు కావడంతో చత్తీస్‌గఢ్ పోలీసులు రంగంలోకి దిగి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అరెస్టు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల రాయ్‌పూర్ వేదికగా ధరమ్ సన్సద్ అనే ఆధ్యాత్మిక సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న కాళీచరణ్.. గాంధీని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై ఐపీసీ 505(2), 294 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
 
మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ దేశాన్ని నాశనం చేశారనీ, అందుకే ఆయన్ను చంపిన నాథూరామ్ గాడ్సేకు శతకోటి వందనాలు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మహంత్ రామ్ సుందర్ దాస్ ఈ వ్యాఖ్యలకు నిరసనగా వేదిక దిగి వెళ్లిపోయారు.
 
ఆయన వెళ్లిపోవడం, కాళీచరణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... కాళీచరణ్ మహారాజ్‌ను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖజురహోలో అరెస్టు చేసి రాయపూర్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments