Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాహనదారులకు శుభవార్త!.. ‘ఫాస్టాగ్’లో కనీస నిల్వ నిబంధన ఎత్తివేత

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (10:48 IST)
వాహనదారులకు కేంద్రం ఊరటనిచ్చే ప్రకటన చేసింది. త్వరలోనే దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో ‘ఫాస్టాగ్’ నిబంధన అమల్లోకి రానున్న నేపథ్యంలో వ్యాలెట్‌లో కనీస నిల్వ ఉండాలన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్టు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఫాస్టాగ్ ఖాతాలో కనీస నిల్వ ఉంటేనే టోల్ ప్లాజాల నుంచి వాహనాలను అనుమతిస్తున్నారు. దీంతో అక్కడ అనవసర రద్దీ ఏర్పడుతోంది.
 
దీనిని నివారించే ఉద్దేశంతో కనీస నిల్వ నిబంధనను ఎత్తివేసింది. ప్రభుత్వ తాజా ప్రకటనతో ఫాస్టాగ్‌లో కనీస మొత్తం లేకున్నా అనుమతిస్తారు. అయితే, ఆ మొత్తాన్ని ఫాస్టాగ్ సెక్యూరిటీ డిపాజిట్ నుంచి మినహాయించుకుంటారు.

వాహనదారులు ఆ తర్వాత చెల్లించే టోల్ ఫీజు విషయంలో దీనిని కూడా కలుపుతారు. కాగా, ప్రస్తుతం 80 శాతం వరకు టోల్ చెల్లింపులు ఫాస్టాగ్ ద్వారానే జరుగుతున్నాయి. ఈ నెల 15 నాటికి దీనిని వంద శాతానికి తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments