Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చు: నితిన్‌ గడ్కరీ

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (22:53 IST)
దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఓ కీలక సూచన చేశారు. కమర్షియల్‌ ట్రక్కు డ్రైవర్లకు నిర్దిష్టమైన పనిగంటలు అమలు చేయాలన్నారు.

పైలట్ల మాదిరిగానే ట్రక్కు డైవర్లకు కూడా నిర్దిష్టమైన పని గంటలు నిర్ణయిస్తే.. అలసట కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మంగళవారం గడ్కరీ వరుస ట్వీట్లు చేశారు.
 
యూరోపియన్ ప్రమాణాలతో సమానంగా కమర్షియల్‌ వాహనాల్లో ఆన్-బోర్డ్ స్లీప్ డిటెక్షన్ సెన్సార్‌లను ఏర్పాటు చేసే విధానంపై పనిచేయాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. జిల్లా రహదారి కమిటీ సమావేశాలు ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా జరిగేలా దేశంలోని ముఖ్యమంత్రులు, జిల్లా కలక్టర్లకు లేఖలు రాయనున్నట్టు పేర్కొన్నారు.

జాతీయ రహదారి భద్రతా మండలి (ఎన్‌ఆర్‌ఎస్‌సీ)కి నామినేట్‌ అయిన సభ్యుల పరిచయ కార్యక్రమంలో ఈ ఉదయం పాల్గొన్న గడ్కరీ.. ప్రతి రెండు నెలలకోసారి ఈ మండలి సమావేశం కావాలని సూచించారు. ఈ సమావేశంలో మరో కేంద్రమంత్రి జనరల్‌ వీకే సింగ్‌ కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments