Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చు: నితిన్‌ గడ్కరీ

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (22:53 IST)
దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఓ కీలక సూచన చేశారు. కమర్షియల్‌ ట్రక్కు డ్రైవర్లకు నిర్దిష్టమైన పనిగంటలు అమలు చేయాలన్నారు.

పైలట్ల మాదిరిగానే ట్రక్కు డైవర్లకు కూడా నిర్దిష్టమైన పని గంటలు నిర్ణయిస్తే.. అలసట కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మంగళవారం గడ్కరీ వరుస ట్వీట్లు చేశారు.
 
యూరోపియన్ ప్రమాణాలతో సమానంగా కమర్షియల్‌ వాహనాల్లో ఆన్-బోర్డ్ స్లీప్ డిటెక్షన్ సెన్సార్‌లను ఏర్పాటు చేసే విధానంపై పనిచేయాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. జిల్లా రహదారి కమిటీ సమావేశాలు ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా జరిగేలా దేశంలోని ముఖ్యమంత్రులు, జిల్లా కలక్టర్లకు లేఖలు రాయనున్నట్టు పేర్కొన్నారు.

జాతీయ రహదారి భద్రతా మండలి (ఎన్‌ఆర్‌ఎస్‌సీ)కి నామినేట్‌ అయిన సభ్యుల పరిచయ కార్యక్రమంలో ఈ ఉదయం పాల్గొన్న గడ్కరీ.. ప్రతి రెండు నెలలకోసారి ఈ మండలి సమావేశం కావాలని సూచించారు. ఈ సమావేశంలో మరో కేంద్రమంత్రి జనరల్‌ వీకే సింగ్‌ కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పై రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments