Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్పీడ్‌టెస్టులో పాల్గొన్న గడ్కరీ - 170 కిమీ వేగంతో దూసుకెళ్లిన కియా కారు

స్పీడ్‌టెస్టులో పాల్గొన్న గడ్కరీ - 170 కిమీ వేగంతో దూసుకెళ్లిన కియా కారు
, ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (17:18 IST)
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ధైర్యమెక్కువ. ఆయనకు రహదారుల్లో అమిత వేగంతో ప్రయాణించడమంటే చాలా ఇష్టం. అందుకే ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా తయారు చేసిన కొత్త కారు స్పీడ్ టెస్టులో మంత్రి స్వయంగా పాల్గొన్నారు. ఆ కారు ఏకంగా 170 కిమీ వేగంతో దూసుకెళ్లింది. ఈ స్పీడ్ టెస్ట్ ఓ జాతీయ రహదారిపై నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వైరల్ అయింది. ఈ టెస్టులో గడ్కరీ స్వయంగా పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. 
 
ఢిల్లీ-ముంబై మధ్య కొత్తగా ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం జరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలను కలిపేందుకు ఉద్దేశించిన ఈ ఎక్స్‌ప్రెస్ హైవే 1,380 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుగుతోంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే దేశంలోనే అత్యంత పొడవైన రహదారిగా చరిత్రకెక్కనుంది. 
 
ప్రస్తుతం 8 లేన్లతో రూపుదిద్దుకుంటున్న ఈ రహదారిని భవిష్యత్తులో 12 లేన్లకు విస్తరించనున్నారు. కాగా, ఎనిమిది లేన్లలో నాలుగు లేన్లు కేవలం ఎలక్ట్రిక్ వాహనాల కోసం కేటాయిస్తుండడం విశేషం. ఈ భారీ రహదారి కోసం రూ.98 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. ఈ రహదారి ద్వారా ఢిల్లీ, ముంబై నగరాల మధ్య ప్రయాణ దూరం 12 గంటలకు తగ్గుతుందని భావిస్తున్నారు.
 
ఈ హైవే పరిశీలన కోసం గడ్కరీ రెండు రోజుల పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఎక్స్ ప్రెస్ హైవే నిర్దేశిత ప్రమాణాల మేర నిర్మాణం జరుపుకుంటోందా, లేదా అనే అంశాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ రహదారిపై స్పీడ్ టెస్టుకు వెళ్లిన గడ్కరీ కియా కార్నివాల్ కారులో గంటకు 170 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించారు. 
 
ఆయనతో పాటు కారులో అధికారులు కూడా ప్రయాణించారు. ఆయన డ్రైవరు పక్క సీటులో కూర్చొనగా, ఓ దశలో కారు స్పీడోమీటర్ ముల్లు 170 కిలోమీటర్లను సూచించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతిలో తృటిలో తప్పిన పెను ప్రమాదం