Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడిగా వున్న తారును బతికున్న కుక్కపై పోసేశారు.. చివరికి?

మానవత్వం మంటగలిసిపోతోంది. వేడిగా ఉన్న తారును బతికున్న శునకంపై వేసి రోడ్డేసిన దారుణ ఘటన ఆగ్రాలోని ఫతేబాద్‌లో చోటుచేసుకుంది. వేడి వేడి తారు మీద పడటంతో ఎంతో బాధతో విలవిలలాడుతున్నప్పటికీ.. రోడ్డు వర్కర్లు

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (16:54 IST)
మానవత్వం మంటగలిసిపోతోంది. వేడిగా ఉన్న తారును బతికున్న శునకంపై వేసి రోడ్డేసిన దారుణ ఘటన ఆగ్రాలోని ఫతేబాద్‌లో చోటుచేసుకుంది. వేడి వేడి తారు మీద పడటంతో ఎంతో బాధతో విలవిలలాడుతున్నప్పటికీ.. రోడ్డు వర్కర్లు ఏమాత్రం కనికరం చూపలేదు.
 
చివరికి ఆ శునకం మృతి చెందింది. బతికున్న శునకంపైనే తారుపోస్తున్నారని స్థానికులు చెప్తున్నా.. కన్‌స్ట్రక్షన్ వర్కర్లు పట్టించుకోలేదని స్థానికులు అంటున్నారు. అయితే మంగళవారం రాత్రి చీకటిలో రోడ్డు నిర్మాణం జరిగిందని.. రోడ్డు పక్కన ఉన్న కుక్కను వర్కర్లు గమనించకపోయి వుండవచ్చునని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
అయితే దీనిపై జంతు సంరక్షణ అధికారులు మండిపడుతున్నారు. కొత్తగా వేసిన రోడ్డు పక్కనే శునకపు కాళ్లు వుండిపోయాయని.. కాసేపు బాధతో విలవిల్లాడిన శునకం ఆపై ప్రాణాలు కోల్పోయిందని గోవింద పరాషర్ అనే సామాజిక కార్యకర్త అన్నారు. కానీ ఉదయానికల్లా కుక్క శవం కనిపించలేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments