Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెండేళ్ళ బాలికను చంపి తినేసిన వీధి కుక్కలు.. ఎక్కడ?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బాలికలకు, యువతులకు కామాంధుల నుంచే కాదు.. వీధి కుక్కల నుంచి రక్షణ లేకుండా పోయింది. రెండేళ్ళ చిన్నారిని వీధి కుక్కలు చంపి తినడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ ఘటన ఉత్తరప్రదే

రెండేళ్ళ బాలికను చంపి తినేసిన వీధి కుక్కలు.. ఎక్కడ?
, బుధవారం, 30 మే 2018 (14:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బాలికలకు, యువతులకు కామాంధుల నుంచే కాదు.. వీధి కుక్కల నుంచి రక్షణ లేకుండా పోయింది. రెండేళ్ళ చిన్నారిని వీధి కుక్కలు చంపి తినడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మోదీనగర్ మున్సిపాలిటీలోని భీంనగర్‌లో వెలుగుచూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన విషయాలను పరిశీలిస్తే..
 
భీంనగర్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి ఇంట్లో ఒంటరిగా ఉన్నది. ఆ సమయంలో వీధి కుక్కల మంద ఇంట్లోకి ప్రవేశించి.. ఒంటరిగా ఉన్న చిన్నారిపై దాడి చేశాయి. పిమ్మట చిన్నారిని నోటకరచుకుని సమీపంలోని చెరకు తోటలోకి తీసుకెళ్లి తినేశాయి. ఈ విషయాన్ని మోదీనరగ్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ పవన్ అగర్వాల్ వెల్లడించారు.
 
ఈ ఘటన అనంతరం కోపోద్రిక్తులైన స్థానిక ప్రజలు మోదీనగర్ మున్సిపాలిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీధికుక్కలు బాలికను చంపి తిన్న ఘటన నేపథ్యంలో వాటిని పట్టుకోవాలని మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీచేశారు. దీంతో మున్సిపల్ అధికారులు వీధికుక్కల నివారణకు శ్రీకారం చుట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇష్టంలేని పెళ్లి చేశారనీ... కూరగాయల కత్తితో భర్త మెడ నరికిన భార్య...